Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆసియా కప్‌ టోర్నీకి ముహూర్తం ఫిక్స్‌.. మెయిన్ టోర్నీ ఎప్పటినుంచంటే..

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ (IPL) టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 26న షురూ కానున్న ఈ ధనాధన్‌ క్రికెట్‌ సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Asia Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆసియా కప్‌ టోర్నీకి ముహూర్తం ఫిక్స్‌.. మెయిన్ టోర్నీ ఎప్పటినుంచంటే..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Mar 19, 2022 | 6:46 PM

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ (IPL) టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 26న షురూ కానున్న ఈ ధనాధన్‌ క్రికెట్‌ సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ జోష్‌లో ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ చెప్పారు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జైషా (Jay Shah) . కరోనా కారణంగా గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణకు సంబంధించి ఆయన ఒక శుభవార్త చెప్పారు. ఐపీఎల్‌ ముగిసిన రెండు నెలల తర్వాత శ్రీలంక (Srilanka) వేదికగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. మెయిన్‌ టోర్నీ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుండగా.. అంతకు ముందే ఆగస్టు 20 నుంచి క్వాలిఫయింగ్‌ టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లన్నీ టీ20 ఫార్మాట్‌లోనే జరుగుతాయి. ఈమేరకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత్‌దే ఆధిపత్యం..

భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ జట్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనుండగా.. మరో స్థానం కోసం యూఏఈ, హాంకాంగ్‌, సింగపూర్‌, కువైట్‌ క్వాలిఫయర్స్ టోర్నీ ఆడనున్నాయి. కాగా1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 సార్లు ఆసియా కప్‌ జరగింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ ఏడుసార్లు ఆసియాకప్‌ను గెల్చుకోగా.. ఆ తర్వాతి శ్రీలంక ఐదు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. ఇక 2018లో చివరిసారిగా జరిగిన టోర్నమెంట్లో భారత్‌ విజేతగా నిలిచింది. ఇక కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో జరపాలని తొలుత భావించినా పరిస్థితులు అనుకూలించలేదు. అయితే ఎట్టకేలకు ఈ టోర్నీకి మోక్షం కలగడంతో క్రికెట్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక శనివారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ జనరల్ మీటింగ్ సమావేశం జరిగింది. ఇందులోనేఉ ఆసియా కప్‌ నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా హాజరయ్యారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీసీ ప్రెసిడెంట్ గా జై షా టర్మ్ ను మరో ఏడాది పాటు పొడిగించారు.

Also Read:Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

Pegasus Spyware Issue: టీడీపీ vs వైసీపీ.. ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేసిన పెగాసస్ వివాదం.. ఇంతకీ ఏది నిజం?

East Godavari: పవన్ తూర్పుగోదావరిలో ఎక్కడా పోటీ చేసినా ఓడిస్తా.. వైసీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్

రేప్ సీన్ తర్వాత వాంతి చేసుకున్నా..
రేప్ సీన్ తర్వాత వాంతి చేసుకున్నా..
అరబిక్ ఆహారం అంటే ఇష్టమా సరికొత్త.. షవర్మ పూరీని ట్రై చేయండి
అరబిక్ ఆహారం అంటే ఇష్టమా సరికొత్త.. షవర్మ పూరీని ట్రై చేయండి
తెలుగుతో సహా 12ప్రాంతీయ భాషల్లోకి ఇంజనీరింగ్ పాఠ్యపుస్తకాల ముద్రణ
తెలుగుతో సహా 12ప్రాంతీయ భాషల్లోకి ఇంజనీరింగ్ పాఠ్యపుస్తకాల ముద్రణ
రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది..
రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది..
అప్పుడే పుట్టిన పిల్లలను ఎందుకు గుడ్డతో చుట్టేస్తారో తెలుసా?
అప్పుడే పుట్టిన పిల్లలను ఎందుకు గుడ్డతో చుట్టేస్తారో తెలుసా?
మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా?
మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా?
తక్కువ ధరకే అరకు అందాలను వీక్షించండి.. IRCTC ప్యాకేజీ వివరాలు
తక్కువ ధరకే అరకు అందాలను వీక్షించండి.. IRCTC ప్యాకేజీ వివరాలు
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ
అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..
అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..
టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!
టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!