AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: భారత్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. బలమైన టీమ్‌తోనే బరిలోకి దిగుతోందిగా..

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు.

IND vs SA: భారత్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. బలమైన టీమ్‌తోనే బరిలోకి దిగుతోందిగా..
India Vs South Africa
Basha Shek
|

Updated on: Oct 31, 2024 | 11:13 PM

Share

నవంబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. బోర్డు ఈ సిరీస్‌కు చాలా మంది ఆటగాళ్లకు స్థానం కల్పించింది. అదే సమయంలో చాలా మంది ఆటగాళ్లను జట్టు నుండి తొలగించింది. దీని ప్రకారం ఇటీవలే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచిన కగిసో రబడ దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపిక కాలేదు. రబడతో పాటు వెటరన్ పేసర్ లుంగి ఎన్‌గిడిని కూడా జట్టు నుంచి తప్పించారు. డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ జట్టులో ఉండగా, ఐడెన్ మర్ క్రమ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వీరితో పాటు మార్కో జాన్సన్, గెరాల్డ్ కొట్జియా కూడా పేసర్లుగా జట్టులోకి వచ్చారు. టీమిండియాతో జరిగే సిరీస్‌కు దక్షిణాఫ్రికా చాలా మంది స్టార్ ఆటగాళ్లకు స్థానం కల్పించింది. . ఇందులో హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మరియు కేశవ్ మహారాజ్ ఉన్నారు. పైన చెప్పినట్లుగా, కగిసో రబడా జట్టులో లేడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రబడ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగలిగాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ సౌతాఫ్రికా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు రబడను ఫిట్‌గా ఉంచాలని నిర్ణయించింది. అందుకే అతనికి విశ్రాంతినిచ్చింది.

టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:

ఐడెన్ మర్ క్రమ్ (కెప్టెన్), ఒటినెల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కొట్జియా, ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిక్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, ర్యాన్ సిమ్పెలన్, ర్యాన్ సిమ్పెలన్, , లూథో సిపమ్లా (3వ మరియు 4వ T20),   ట్రిస్టన్ స్టబ్స్.

ఇవి కూడా చదవండి

టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.

దక్షిణాఫ్రికాతో T20సిరీస్ షెడ్యూల్

  • మొదటి మ్యాచ్- నవంబర్ 8- డర్బన్
  • రెండో మ్యాచ్- నవంబర్ 10- పోర్ట్ఎలిజబెత్
  • మూడో మ్యాచ్- నవంబర్ 13- సెంచూరియన్
  • నాల్గవ మ్యాచ్- 15 నవంబర్- జోహన్నెస్‌బర్గ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..