Sourav Ganguly: ప్రమాదంలో ఆ సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు.. పరోక్షంగా చెప్పిన బీసీసీసీ అధ్యక్షుడు గంగూలీ..

భారత క్రికెట్ జట్టులో మార్పుల కాలం నడుస్తోంది. ప్రధాన కోచ్ నుంచి కెప్టెన్సీ వరకు మార్పు వచ్చింది. మరికొద్ది రోజుల్లో జట్టులో కూడా అదే మార్పు కనిపించనుంది...

Sourav Ganguly: ప్రమాదంలో ఆ సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు.. పరోక్షంగా చెప్పిన బీసీసీసీ అధ్యక్షుడు గంగూలీ..
Sourav Ganguly
Follow us

|

Updated on: Feb 03, 2022 | 2:52 PM

భారత క్రికెట్ జట్టులో మార్పుల కాలం నడుస్తోంది. ప్రధాన కోచ్ నుంచి కెప్టెన్సీ వరకు మార్పు వచ్చింది. మరికొద్ది రోజుల్లో జట్టులో కూడా అదే మార్పు కనిపించనుంది. ముఖ్యంగా టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ పేరు ఇంకా ప్రకటించలేదు. అదే సమయంలో కొంతమంది సీనియర్ ఆటగాళ్ల స్థానం కూడా ముప్పులో ఉంది. ఇందులో అజింక్యా రహానే(ajimkya rahane), చెతేశ్వర్ పుజారా(cheteshwar pujara) ఉన్నారు. వీరిద్దరి పేలవమైన ఫామ్ కారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో వారి స్థానం కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ(sourav ganguly) కూడా ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను ప్రస్తుతానికి జట్టు నుండి డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సూచించాడు.

టెస్టు ఫార్మాట్‌లో దాదాపు దశాబ్ద కాలంగా టీమిండియా మిడిల్ ఆర్డర్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు గత రెండేళ్లుగా పేలవ ఫామ్‌తో కొనసాగుతున్నారు. కోహ్లీ పాత రికార్డు, కెప్టెన్‌గా చేసి ఉన్నాడు. అతని స్థానం ప్రమాదంలో పడలేదు, అయితే ప్రతి సిరీస్‌తో పుజారా, రహానెలు డ్రాప్ అయ్యే అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన వారి ఇప్పుడు ప్రస్తుతానికి సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరున శ్రీలంకతో స్వదేశంలో టీమ్ ఇండియా టెస్టు సిరీస్ ఆడాల్సి ఉందని, అందులో ఈ ఇద్దరి ఎంపిక చేస్తారా లేదా చూడాలి. అయితే బీసీసీఐ బాస్ గంగూలీ తన తరపున సెలక్టర్ల ఉద్దేశాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ మ్యాగజైన్ స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడిన గంగూలీ పలు విషయాలు చెప్పారు. “ఆ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడతారని, చాలా పరుగులు చేస్తారని ఆశిస్తున్నాను. వారు తప్పకుండా సాధిస్తారని నేను భావిస్తున్నాను. రంజీ ట్రోఫీ చాలా ముఖ్యమైన టోర్నమెంట్, మేమంతా ఇందులో పాల్గొన్నాము.” అని అన్నారు.

రహానే-పుజారా స్థానంలో ఎవరు?

కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని గత కొన్ని నెలలుగా క్రికెట్ నిపుణులు, భారత అభిమానులు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి వంటి బ్యాట్స్‌మెన్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం చేయాలనే చర్చ జరుగుతోంది. హనుమ విహారి గత 3 సంవత్సరాలుగా టీమ్ ఇండియాలో ఉన్నాడు, కానీ అతనికి చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో, అయ్యర్ గతేడాది నవంబర్‌లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక సిరీస్‌కు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు జట్టులో ఉండటం దాదాపు ఖాయమని చెబుతున్నారు.

Read Also.. IPL 2022 Mega Auction: అతనికి వేలంలో భారీ డిమాండ్ ఉంటుంది.. ఏ ఫ్రాంచైజీ ఎవరిని తీసుకుంటుందో చెప్పిన బ్రాడ్ హాగ్..