AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..

టీ 20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో ఓడిపోయిన భారత్ నాలుగు రోజుల తర్వాత బుధవారం సాయంత్రం నెట్స్‎లో ప్రాక్టీస్ చేసింది. టీం ఇండియా అక్టోబర్ 31న ఆదివారం న్యూజిలాండ్‎తో తలపడనుంది...

T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..
Kishan
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Oct 29, 2021 | 4:41 PM

Share

టీ 20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో ఓడిపోయిన భారత్ నాలుగు రోజుల తర్వాత బుధవారం సాయంత్రం నెట్స్‎లో ప్రాక్టీస్ చేసింది. టీం ఇండియా అక్టోబర్ 31న ఆదివారం న్యూజిలాండ్‎తో తలపడనుంది. ఈ ప్రాక్టీస్ సెషన్‎లో టీం ఇండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెమటోర్చాడు. కోహ్లి 45 నిమిషాల పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. లాంగాన్‌, లాంగాఫ్‌, ఢిఫెన్స్‌, స్క్వేర్‌కట్‌, మిడ్‌ వికెట్‌ మీదుగా విరాట్ కొన్ని షాట్లు ఆడాడు. అక్కడే ఉ‍న్న యువ ఆటగాళ్లు శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ కన్ను ఆర్పకుండా కోహ్లీ బ్యాటింగ్‎ను చూశారు. ఈ వీడియోను ఐసీసీ ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

ఇషాన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో భాగం అయితే ప్లేయింగ్ XIలోకి ప్రవేశించే అవకాశం రాలేదు. పాకిస్తాన్‎లో జరిగిన మ్యాచ్‎లో సూర్యకుమార్ యాదవ్‎కు చోటు కల్పించడంతో ఇషాన్ తుది జట్టులోకి ఎంపిక కాలేదు. స్టాండ్‌బై జాబితాలో ఉన్న ముగ్గురు ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‎తో జరిగే మ్యాచ్ ‎లో తన ఫామ్‎ను కొనసాగించాలని చూస్తున్నాడు. కోహ్లీతో పాటు, హార్దిక్ పాండ్యా కూడా సెషన్‌లో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే పాండ్యా న్యూజిలాండ్‎తో జరిగే మ్యాచ్‎లో బౌలింగ్ వేస్తాడా లేదా అన్న తెలియరాలేదు.

అయితే ఆదివారం జరిగే మ్యాచ్‎ న్యూజిలాండ్, ఇండియాకు కీలంగా మారింది. ఈ రెండు జట్లు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి. గ్రూప్-2లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఆప్ఘానిస్తాన్ రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండి, భారత్ మూడు, నాలుగు స్థానాల్లో ఉంది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ ఇండియా, కీవిస్‎కు ముఖ్యగా మారింది. ఈ మ్యాచ్‎లో గెలిస్తేనే భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. గ్రూప్-2లో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‎లో గెలిచి అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండిస్ తర్వాతి స్థానాల్లో ఉంది.

Read Also.. Ind Vs Pak: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉంది.. పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్..

Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..

David Warner: ఐపీఎల్ 2022 వేలంలో నా పేరు ఉండబోతుంది.. డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?