AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: భారీ భద్రత ఉన్నా.. కోహ్లీ కోసం మైదానంలో ఎంట్రీ ఇచ్చిన అభిమాని.. కట్‌చేస్తే..

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ అభిమాని మైదానంలోకి దిగి విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తుండగా క్రీజులోకి వచ్చిన ఓ అభిమాని అతని కాళ్లు పట్టుకున్నాడు.

Video: భారీ భద్రత ఉన్నా.. కోహ్లీ కోసం మైదానంలో ఎంట్రీ ఇచ్చిన అభిమాని.. కట్‌చేస్తే..
Kohli Fan Video
Venkata Chari
|

Updated on: Mar 26, 2024 | 10:18 AM

Share

Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2024 ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ అభిమాని మైదానంలోకి దిగి విరాట్ కోహ్లీ కాలు పట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తుండగా క్రీజులోకి వచ్చిన ఓ అభిమాని అతని కాలు పట్టుకున్నాడు. భారీ భద్రత ఉన్నప్పటికీ, కోహ్లీ అభిమానులు మైదానంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారిస్తున్నారు.

మైదానంలోకి దిగి కోహ్లీ కాలు పట్టుకున్న అభిమానిని విచారించగా అతడు రాయచూరుకు చెందిన మైనర్ అని తెలిసింది. రాయచూర్ నుంచి రైలులో వచ్చిన 17 ఏళ్ల మైనర్ రూ.3000 చెల్లించి డి బ్లాక్ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అతను విరాట్ కోహ్లీకి పిచ్చి అభిమాని.

ఇవి కూడా చదవండి

కోహ్లీ క్రీజులోకి వెళ్లాక ఏం జరిగింది?

పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కోహ్లీ, డుప్లెసిస్ క్రీజులోకి వెళ్తున్నారు. ఇంతలో ఆ యువకుడు రంగంలోకి దిగాడు. కోహ్లి క్రీజులోకి వెళుతుండగా వెనుక సీట్లో ఉన్నవాళ్లు ‘కోహ్లీని పట్టుకో’ అని అరుస్తున్నారని విచారణలో పోలీసులకు సమాచారం అందించాడు. అది వినగానే గ్రిల్ నుంచి దూకి రంగంలోకి దిగానని తెలిపాడు.

రాయచూర్‌కు చెందిన మైనర్‌పై కబ్బన్‌పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించడంతోపాటు మైదానంలోకి చొరబడినట్లు కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 49 బంతుల్లో 77 పరుగులు చేసి ఆర్సీబీ విజయానికి ఎంతగానో సహకరించాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో RCB 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాటు టోర్నీలో 2 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఒకదానిలో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..