Rohit Sharma Retirement: రిటైర్మెంట్ చేసేది ఆ రోజే.. కెరీర్ ముగింపుపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
Rohit Sharma: గత సంవత్సరం ODI ప్రపంచ కప్ 2023 లో రోహిత్ శర్మ ట్రోఫీని గెలుచుకునే గొప్ప అవకాశం కలిగి ఉన్నాడు. అయితే టీం ఇండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు మెన్ ఇన్ బ్లూపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

2027 ODI World Cup: టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు గురించి కీలక అప్డేట్ ఇచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడతానంటూ అభిమానులకు రోహిత్ గుడ్న్యూస్ తెలిపాడు. 36 ఏళ్ల స్టార్ బ్యాట్స్మెన్ ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నానని, ఇందుకోసం మరికొన్ని సంవత్సరాలు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ప్రపంచకప్ ట్రోఫీని ఎలాగైనా గెలవాలని కోరుకున్నట్లు తెలిపాడు. 2011 ప్రపంచకప్లో రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు. ఆ సమయంలో ఎంఎస్ ధోని జట్టు కెప్టెన్గా ఉన్నాడు.
ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్..
గత సంవత్సరం ODI ప్రపంచ కప్ 2023 లో రోహిత్ శర్మ ట్రోఫీని గెలుచుకునే గొప్ప అవకాశం కలిగి ఉన్నాడు. అయితే టీం ఇండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు మెన్ ఇన్ బ్లూపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.
ప్రపంచకప్ గెలవాలనుకుంటున్నాను: రోహిత్
రోహిత్ శర్మకు ఇదే చివరి ప్రపంచకప్ అని, కొన్నేళ్లలో అతను రిటైర్మెంట్ తీసుకుంటాడని చాలా మంది అభిమానులు ఓటమి తర్వాత మాట్లాడుకున్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో రోహిత్ మాట్లాడుతూ.. తాను 2027 ODI ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నట్లు సూచించాడు. గౌరవ్ కపూర్, ఎడ్ షిరీన్లతో సంభాషణలో తన భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడాడు. ప్రస్తుతానికి కోచింగ్ గురించి ఆలోచించడం లేదని రోహిత్ ప్రకటించాడు. కానీ, జీవితం ఎప్పుడు, ఎక్కడికి తీసుకెళుతుందో తెలియదు. నేను ప్రస్తుతం ఆడుతున్నాను. ఇటువంటి పరిస్థితిలో, నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. దీని తర్వాత ఎడ్ షిరిన్, భారత్ ప్రపంచకప్ గెలుస్తుందా అని రోహిత్ను ప్రశ్నించాడు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ అవును, టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.




వచ్చే ఏడాది లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు అర్హత సాధిస్తుందని ఆశిస్తున్నానని రోహిత్ అన్నాడు. ఈ ఫైనల్ 2025 సంవత్సరంలో జరుగుతుంది. మా బృందం ఈ ఫైనల్కు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది.
ఇప్పటి వరకు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో రెండుసార్లు ఫైనల్స్కు చేరిందని, అయితే రెండుసార్లు ఓడిపోయింది. 2021లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ టీమ్ ఇండియాను ఓడించింది. అయితే 2023 సంవత్సరం ఫైనల్లో పాట్ కమిన్స్ టీం భారత జట్టును ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




