AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit-Kohli: ఢిల్లీ టెస్టులో రెండు వింత సంఘటనలు.. రోహిత్-కోహ్లీ కెరీర్‌లో తొలిసారి ఇలా.. అవేంటో తెలిస్తే షాకే..

India Vs Australia: ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గతంలో ఎన్నడూ చేయని పనిని చేశారు.

Rohit-Kohli: ఢిల్లీ టెస్టులో రెండు వింత సంఘటనలు.. రోహిత్-కోహ్లీ కెరీర్‌లో తొలిసారి ఇలా.. అవేంటో తెలిస్తే షాకే..
Ind Vs Aus 2nd Test
Venkata Chari
|

Updated on: Feb 20, 2023 | 4:55 AM

Share

ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే గతంలో ఎన్నడూ జరగనివి ఈ విజయంలో కొన్ని జరిగాయి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విషయంలో ప్రత్యేకంగా నిలిచాయి. గతంలో ఎన్నడూ చేయని పనిని ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చేశారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మాల్సిందే.

ఈ మ్యాచ్‌లో మూడో రోజు భారత్‌ విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుస్తుందని అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా భారత్ 262 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత జట్టు స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టును 113 పరుగులకే కట్టడి చేశారు. విజయం సాధించాలంటే భారత్ 115 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగు వికెట్లు కోల్పోయింది.

రోహిత్, కోహ్లీ తొలిసారి ఇలా..

కెరీర్‌లో ఇంతకు ముందు ఏ టెస్టులోనూ చేయని పనిని రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్, కోహ్లి చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగుల వద్ద రోహిత్ రనౌట్ అయ్యాడు. అతన్ని పీటర్ హ్యాండ్‌కాంబ్, అలెక్స్ కారీ కలిసి రనౌట్ చేశారు. టెస్టు కెరీర్‌లో రోహిత్ తొలిసారి రనౌట్ అయ్యాడు. రోహిత్ తన కెరీర్‌లో అంతకుముందు 46 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో కోహ్లి స్టంపౌట్ అయ్యాడు. టాడ్ మర్ఫీ వేసిన బంతిని ప్లిక్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. కానీ, బాల్ షాట్ మిస్ అయ్యి వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతిలోకి వెళ్లింది. దీంతో కోహ్లీని స్టంపౌట్ చేశాడు. కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో తొలిసారి స్టంపౌట్ అయ్యాడు. గతంలో కోహ్లి 105 టెస్టు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్కసారి కూడా స్టంపౌట్ కాలేదు. అయితే ఈ టెస్టులో అతని పరంపరకు బ్రేక్ పడింది.

హాఫ్ సెంచరీ చేయలేకపోయిన ఇద్దరూ..

ఢిల్లీ టెస్టు మ్యాచ్‌లో రోహిత్, కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ బాగానే ఆరంభించినా అర్ధ సెంచరీగా మలచలేకపోయాడు. 69 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అదే సమయంలో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కానీ, 44 పరుగుల వద్ద ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అతని ఎల్‌బీడబ్ల్యూ అవుట్‌పై చాలా వివాదాలు చెలరేగాయి. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రోహిత్ 50 పరుగులకు మించి శుభారంభం అందించలేకపోయాడు. 20 పరుగుల వద్ద విరాట్ ఔటయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..