Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. టీమిండియా విజయంలో 5 కీలక విషయాలు ఇవే..

IND vs AUS: రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియన్ జట్టు బ్యాటింగ్‌లో విఫలమై,పేకమేడలా కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే ఆలౌటైంది.

IND vs AUS: చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. టీమిండియా విజయంలో 5 కీలక విషయాలు ఇవే..
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించారు.
Follow us
Venkata Chari

|

Updated on: Feb 11, 2023 | 3:06 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఘనవిజయంతో ఆధిక్యంలోకి చేరింది. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉండగా.. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియన్ జట్టు బ్యాటింగ్‌లో విఫలమై,పేకమేడలా కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా విజయం గురించి 5 కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. టెస్టుల్లో భారత్‌లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

  1. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా భావించే పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించాడు. రోహిత్ సెంచరీ టీమ్ ఇండియాను బలోపేతం చేసింది. ఈ ఇన్నింగ్స్‌తోనే భారత్ భారీ స్కోర్‌కు పునాది వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 120 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 212 బంతులు ఎదుర్కొన్న అతను 15 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
  2. రవీంద్ర జడేజా అటాక్ కూడా టీమిండియా విజయానికి ఒక ముఖ్య కారణంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా తన స్పిన్‌ మ్యాజిక్‌ని చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు.
  3. రవిచంద్రన్‌ అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టి, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో రెచ్చిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా వద్ద సమాధానం లేకపోయింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌ని తన బలిపశువుగా చేసుకున్నాడు.
  4. ఈ మ్యాచ్‌లో రోహిత్, జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. వీరితో పాటు అక్షర్ పటేల్ కూడా బ్యాట్‌తో తనదైన ముద్ర వేశారు. తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ 84 పరుగులు చేశాడు. అయితే, అతను తన తొలి అంతర్జాతీయ సెంచరీని కోల్పోయాడు. కానీ అతని ఇన్నింగ్స్ ఆధారంగా, ఆస్ట్రేలియాపై భారత్ బలమైన ఆధిక్యాన్ని సంపాదించగలిగింది.
  5. ఈ మ్యాచ్‌లో అక్షర్ జడేజాతో కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మహ్మద్ షమీతో కలిసి 52 పరుగులు జోడించడం టీమిండియాకు బాగా ఉపయోగపడింది. ఈ భాగస్వామ్యంతో భారత్ 200 పరుగులకు పైగా ఆధిక్యం సంపాదించగలిగింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..