AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News: 3 ఓవర్లు.. 7 పరుగులు.. 5 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్.. ఎక్కడంటే?

మొహాలీలో జరిగిన రెడ్ బుల్ క్యాంపస్ క్రికెట్ పురుషుల నేషనల్ ఫైనల్స్ రెండో సెమీఫైనల్‌లో ఎల్‌జే కాలేజ్ 53 పరుగుల భారీ తేడాతో డీఏవీవీని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

Cricket News: 3 ఓవర్లు.. 7 పరుగులు.. 5 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్.. ఎక్కడంటే?
Cricket
Venkata Chari
|

Updated on: Jun 11, 2022 | 7:23 AM

Share

టీ20 క్రికెట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. తరచుగా బౌలర్లు దెబ్బతింటూనే ఉంటుంటారు. కానీ, అప్పుడప్పుడు ఎంతో బాగా రాణిస్తుంటారు. బౌలర్ ఎక్కువ వికెట్లు పడగొట్టడం, చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. మొహాలీలో జరిగిన T20 మ్యాచ్‌లోనూ అలాంటి దృశ్యం ఒకటి కనిపించింది. అక్కడ ఎడమచేతి వాటం స్పిన్నర్ స్మిత్ పటేల్ వరుసగా వికెట్లు తీయడమే కాకుండా పరుగులు తక్కువ ఇచ్చి ఆకట్టుకున్నాడు.

మొహాలీలోని యూనివర్సిటీల మధ్య టీ20 టోర్నీ జరుగుతోంది. రెడ్ బుల్ క్యాంపస్ క్రికెట్ పురుషుల జాతీయ టోర్నమెంట్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలల జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు జూన్ 10వ తేదీ శుక్రవారం నాడు జరిగాయి. ఇందులో గుజరాత్‌కు చెందిన న్యూస్ LJ కాలేజ్ రెండవ సెమీ-ఫైనల్‌లో ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి విశ్వవిద్యాలయంతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఎల్‌జే కాలేజ్ సులువుగా గెలుపొందింది. ఇందులో ఆ జట్టు స్పిన్నర్ స్మిత్ పటేల్ అద్భుత బౌలింగ్ దెబ్బకు ప్రత్యర్థులు భయపడ్డారు.

బ్యాట్‌తో పాండ్యా..

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో ఎల్‌జే కళాశాల తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ చెలరేగి బ్యాటింగ్‌కు దిగి 173 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టు తరపున ధవల్ పాండ్యా అత్యధిక పరుగులు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కేవలం 22 బంతుల్లో 46 పరుగులు ఇచ్చాడు. తన ఇన్నింగ్స్‌లో పాండ్యా 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతడితో పాటు ఓపెనర్ యష్రాజ్ జోషి కూడా 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. డీఏవీవీ తరపున శుభమ్ గుంజాల్ 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

స్పిన్‌తో ఆకట్టుకున్న స్మిత్ పటేల్..

DAVV బ్యాటింగ్‌లో తడబడింది. ఎల్‌జేసీ బౌలర్లు జట్టులోని టాప్ బ్యాట్స్‌మెన్‌లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆ జట్టు 9 ఓవర్లలో 52 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. అలాగే 14 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. DAVV ఇన్నింగ్స్ కేవలం 120 పరుగులకు పరిమితమైంది. స్మిత్ పటేల్ కీలకంగా ఆడి, 5 వికెట్లు తీయడమే కాకుండా, తన 3 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.