AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1xBet Betting Case : బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధావన్‌లకు ఈడీ షాక్.. రూ.11.14 కోట్ల ఆస్తులు అటాచ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ భారత క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‎ల మొత్తం రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈ చర్య తీసుకున్నారు. జప్తు చేసిన ఆస్తులలో సురేష్ రైనా పేరు మీద ఉన్న రూ.6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్ పేరు మీద ఉన్న రూ.4.5 కోట్ల స్థిరాస్తి ఉన్నాయి.

1xBet Betting Case : బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధావన్‌లకు ఈడీ షాక్.. రూ.11.14 కోట్ల ఆస్తులు అటాచ్
1xbet Betting Case
Rakesh
|

Updated on: Nov 06, 2025 | 4:56 PM

Share

1xBet Betting Case : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ భారత క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‎ల మొత్తం రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈ చర్య తీసుకున్నారు. జప్తు చేసిన ఆస్తులలో సురేష్ రైనా పేరు మీద ఉన్న రూ.6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, శిఖర్ ధావన్ పేరు మీద ఉన్న రూ.4.5 కోట్ల స్థిరాస్తి ఉన్నాయి. చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ 1xBet కు సంబంధించిన అనేక రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగింది. 1xBet, దాని అనుబంధ బ్రాండ్లు 1xBat, 1xBat Sporting Lines భారతదేశంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ జూదాన్ని ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తులో వెల్లడైంది.

రైనా, శిఖర్ ధావన్ విదేశీ కంపెనీలతో కలిసి ఈ ప్లాట్‌ఫారమ్‌లను ప్రచారం చేశారు. దీనికి బదులుగా వారికి విదేశీ మార్గాల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ డబ్బు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ద్వారా సంపాదించింది. దీని ఒరిజినల్ సోర్స్ దాచడానికి క్లిష్టమైన లావాదేవీలు జరిగాయి. 1xBet భారతదేశంలో వేలాది నకిలీ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 6000 కంటే ఎక్కువ నకిలీ ఖాతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఖాతాల ద్వారా బెట్టింగ్ డబ్బును వేర్వేరు పేమెంట్ గేట్‌వేల ద్వారా మళ్లించి ఒరిజినల్ సోర్స్ దాచారు. అనేక పేమెంట్ గేట్‌వేలు KYC వెరిఫికేషన్ లేకుండానే వ్యాపారులను (మర్చంట్స్) చేర్చుకుంటున్నాయని దర్యాప్తులో తేలింది. మనీ లాండరింగ్ మొత్తం ట్రేల్ రూ.1000 కోట్లకు పైగా ఉంది.

ఈ కేసులో ఈడీ నాలుగు పేమెంట్ గేట్‌వేలపై దాడులు నిర్వహించింది. 60కి పైగా బ్యాంక్ ఖాతాలను నిలిపివేసింది. ఇప్పటివరకు రూ.4 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని నిలిపివేశారు. ప్రజలు ఏ రకమైన ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా జూదం ప్రచారం లేదా పెట్టుబడుల నుంచి దూరంగా ఉండాలని ఈడీ హెచ్చరించింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, జూదం ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా, మనీ లాండరింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను కూడా ప్రోత్సహిస్తాయని ఈడీ పేర్కొంది. ఏదైనా అనుమానాస్పద ఆన్‌లైన్ ప్రకటన లేదా లావాదేవీ గురించి వెంటనే స్థానిక పోలీసులకు లేదా ఈడీకి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..