MS Dhoni: రాక్‌స్టార్‌గా మారిపోయిన ఎంఎస్‌ ధోని.. గిటార్‌ పట్టుకుని సరదా సరదాగా.. వైరల్‌ వీడియో

అంతకు ముందు రాక్‌స్టార్‌గా మారిపోయాడు మిస్టర్ కూల్. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో. అతను ఒక్కడే కాదు. అతనితో పాటు పలువురు క్రీడాకారులు కూడా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.

MS Dhoni: రాక్‌స్టార్‌గా మారిపోయిన ఎంఎస్‌ ధోని.. గిటార్‌ పట్టుకుని సరదా సరదాగా.. వైరల్‌ వీడియో
Ms Dhoni
Follow us

|

Updated on: Mar 15, 2023 | 8:12 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి ఈ లీగ్‌లో ఆడబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ధోనీ కనిపించనున్నాడు. ఇప్పటికే ధనాధన్ లీగ్‌ కోసం ప్రాక్టీస్‌ మొదలెట్టాడు ధోనీ. అయితే అంతకు ముందు రాక్‌స్టార్‌గా మారిపోయాడు మిస్టర్ కూల్. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో. అతను ఒక్కడే కాదు. అతనితో పాటు పలువురు క్రీడాకారులు కూడా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. కాగా టోర్నీ ప్రారంభానికి ముందు ఐపీఎల్‌ జట్లు ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ బిజిబిజీగా గడుపుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోని రాక్‌స్టార్‌గా మారిపోయాడు. గిటార్‌ వాయిస్తూ సందడి చేశాడు. ధోనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, దీపక్ చాహర్ కూడా డ్యాన్స్ చేస్తూ, సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే తన అధికారిక ట్వి్ట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధోని బ్యాట్‌ నుంచి జాలువారే సిక్స్‌లు, ఫోర్లు కొట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. నాలుగుసార్లు ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అది కూడా ధోని సారథ్యంలోనే. . 2010. 20211, 2017, 2021లో చెన్నై ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఇప్పుడు ఐదో టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ఆ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఐపీఎల్ ప్రారంభం నుంచి అంటే 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. తాజా ఎడిషన్‌ ధోనికి చివరి IPL కావచ్చని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..