Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే న్యూస్‌.. మోడీ, సచిన్‌లతో వేదిక పంచుకోనున్న రామ్‌ చరణ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఆస్కార్‌ గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ హీరో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి వేదిక పంచుకోనున్నారు.

Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే న్యూస్‌.. మోడీ, సచిన్‌లతో వేదిక పంచుకోనున్న రామ్‌ చరణ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
Pm Modi, Ram Charan, Sachin
Follow us
Basha Shek

|

Updated on: Mar 14, 2023 | 7:50 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్‌ సినిమాపైనే చర్చ సాగుతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. సామాన్యుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్లమెంట్లోనూ జక్కన్న సినిమాపై ప్రశంసలు దక్కాయి. ఇక ట్రిపులార్‌ టీం అమెరికా నుంచి రాగానే ఘనంగా సన్మానించేందుకు రెడీ అవుతున్నారు చాలామంది. ఇదిలా ఉంటే ఆస్కార్‌ గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ హీరో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి వేదిక పంచుకోనున్నారు. ప్రస్తుతం ఈ విషయం మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్‌ ఇస్తోంది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఈనెల 17,18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదే ఈవెంట్‌లో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌తో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసినందుకు మెగా పవర్‌స్టార్‌ని ప్రధాని మోడీ ఘనంగా సన్మానించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాతో గ్లోబర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్‌ ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్‌ అసోసియేషన్ అవార్డుల్లో కూడా సత్తా చాటాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ 15 (వర్కింగ్ టైటిల్‌) సినిమా చేయనున్నాడు చెర్రీ. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by THYVIEW (@thyview)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..