AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: వర్షం వచ్చి మావాళ్ల పరువు కాపాడింది.. వాడుకూడా తోడై ఉంటే నరకానికి స్పెల్లింగే..!

Michael Vaughan Comments Team India vs England 1st T20i: తొలి పోరు వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసినప్పటికీ, టీమిండియా తనేంటో ఇంగ్లాండ్‌కు రుచి చూపించింది. మైఖేల్ వాన్ చెప్పినట్లుగా రాబోయే నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ జట్టు భారత వ్యూహాలను ఎలా ఎదుర్కొంటుంది, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ లాంటి యువ సంచలనాలు రంగంలోకి దిగితే ఎలాంటి ముక్కోణపు పోటీ ఎదురవుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

IND vs ENG: వర్షం వచ్చి మావాళ్ల పరువు కాపాడింది.. వాడుకూడా తోడై ఉంటే నరకానికి స్పెల్లింగే..!
Ind Vs Eng 1st T20i Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Jul 03, 2026 | 5:05 PM

Share

Michael Vaughan Comments Team India vs England 1st T20I: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయినప్పటికీ, భారత బ్యాటర్ల వీరోచిత ప్రదర్శన ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఐర్లాండ్ పర్యటనలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ టీమిండియా, ఒక్కసారిగా ఇంగ్లాండ్ గడ్డపై సింహంలా గర్జించడం చూసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విస్మయం వ్యక్తం చేశాడు.

ఐర్లాండ్ వైఫల్యాల నుంచి ఇంగ్లాండ్‌లో విశ్వరూపం!

కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్ పర్యటనలో కనీసం 150 పరుగులు చేయడానికి కూడా నానా అవస్థలు పడ్డ భారత జట్టును చూసి అందరూ పెదవి విరిచారు. ఒక మ్యాచ్‌లో 148 పరుగులకే కుప్పకూలడం, మరో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. కానీ, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో మాత్రం భారత బ్యాటర్లు మైదానంలో పరుగుల వరద పారించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలతో ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతుంటే, శివమ్ దూబే కేవలం 21 బంతుల్లోనే 42 పరుగులు చేసి మ్యాచ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.

ఇదికూడా చదవండి: ఇంగ్లాండ్‌తో రెండో టీ20 సమరం.. టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!

గెలిచే మ్యాచ్‌ను అడ్డుకున్న వరుణుడు..!

ఆ పిచ్‌పై 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లాండ్ బ్యాటర్లకు అంత సులువు కాదు. భారత బౌలింగ్ లైనప్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం దాదాపు ఖాయంగా కనిపించింది. కానీ దురదృష్టవశాత్తు వర్షం రూపంలో వచ్చిన ఆటంకం భారత గెలుపు ఆశలపై నీళ్లు చల్లింది. మ్యాచ్ రద్దయినప్పటికీ, మిగిలిన నాలుగు టీ20 మ్యాచ్‌లలో భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్రీడా విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు.

మైఖేల్ వాన్ మైండ్ బ్లాక్.. ఆ కుర్రాడు వస్తే ఇంగ్లాండ్ పని ఖతం..!

భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై పుంజుకున్న తీరుపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు. “ఐర్లాండ్‌లో కష్టపడిన భారత్‌కు, ఇక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు బాగా కలిసివచ్చినట్లు ఉన్నాయి. ఈ సిరీస్ గెలవాలంటే మా ఇంగ్లాండ్ జట్టు చెమటోడ్చాల్సిందే. రాబోయే నాలుగు మ్యాచుల్లో ఇరు జట్ల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరు తప్పదు” అని వాన్ అన్నాడు. భారత్ తదుపరి మ్యాచ్‌లలో 15 ఏళ్ల రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీని గనుక తుది జట్టులోకి తీసుకుంటే, ఇంగ్లాండ్ బౌలర్లకు నరకం ఖాయమని, అతడి రాకతో భారత బ్యాటింగ్ మరింత ప్రమాదకరంగా మారుతుందని వాన్ హెచ్చరించడం విశేషం.

ఇది కూడా చదవండి: ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ.. అసలు లెక్కలు చూసే ధైర్యముందా..!

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us