AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంగ్లాండ్‌తో రెండో టీ20 సమరం.. టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!

India vs England 2nd T20I: మాంచెస్టర్ పిచ్‌పై ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సమయ వేళలు కలిసిరావడం, వైభవ్ లాంటి యువ రక్తం జట్టులోకి వచ్చే అవకాశాలు ఉండడం భారత్‌కు సానుకూలాంశాలైతే, జోఫ్రా ఆర్చర్ రూపంలో పొంచి ఉన్న ముప్పును మన బ్యాటర్లు ఎలా తిప్పికొడతారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానులను అలరించేందుకు ఈ హై-వోల్టేజ్ పోరు సిద్ధమైంది.

ఇంగ్లాండ్‌తో రెండో టీ20 సమరం.. టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
Eng Vs Ind 2nd T20i
Venkata Chari
|

Updated on: Jul 03, 2026 | 3:07 PM

Share

India vs England 2nd T20I: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం మాంచెస్టర్ వేదికగా రెండో పోరు జరగనుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కావడంతో నిరాశ చెందిన క్రికెట్ అభిమానులకు ఈ రెండో మ్యాచ్‌ ముంగిట ఊరటనిచ్చే రెండు తీపి కబుర్లతో పాటు, భారత జట్టును కలవరపెట్టే ఒక చేదు వార్త కూడా తెరపైకి వచ్చింది.

క్రికెట్ ప్రేమికులకు పండగే.. ప్రైమ్ టైమ్‌లో మ్యాచ్ షురూ..!

సాధారణంగా ఇంగ్లాండ్ వేదికగా జరిగే మ్యాచ్‌లను వీక్షించాలంటే భారత అభిమానులు అర్ధరాత్రి వరకు మేల్కోవాల్సి వస్తుంది. మరుసటి రోజు ఆఫీసులు, పనులకు వెళ్లేవారికి ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. అయితే, ఈ సిరీస్‌లో క్రికెట్ ప్రేమికులకు మేనేజ్‌మెంట్ ఒక సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకే ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగానే రేపు జరగబోయే రెండో టీ20 సాయంత్రం 7 గంటలకే మొదలవుతుంది. దీనివల్ల అర్ధరాత్రి దాటే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్రైమ్ టైమ్‌లోనే హాయిగా మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.

తుది జట్టులోకి ఆ సంచలన కుర్రాడు.. ఫ్యాన్స్ ఖుషీ..!

రెండో శుభవార్త ఏమిటంటే.. ప్రస్తుత పర్యటనలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చోటు దక్కించుకోలేకపోయిన సంచలన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఎట్టకేలకు తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతటి ప్రతిభావంతుడైన కుర్రాడికి బెంచ్ కే పరిమితం చేయడంపై టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్, కోచ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను పక్కన పెట్టకుండానే, బ్యాటింగ్ ఆర్డర్‌లో చిన్నపాటి మార్పులు చేస్తూ వైభవ్‌ను జట్టులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ యువ సంచలనం క్రీజులోకి వస్తే భారత బ్యాటింగ్ లైనప్‌కు మరింత పదును పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్‌కు డేంజర్ అలర్ట్.. ఇంగ్లాండ్ అస్త్రం సిద్ధం..!

ఇక భారత జట్టును ఆందోళనకు గురిచేసే ఆ ఒక్క చేదు వార్త ఏమిటంటే.. ఇంగ్లాండ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. వర్షార్పణమైన తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ 189 పరుగుల భారీ స్కోరు సాధించారు. తమ బౌలింగ్ వైఫల్యం వల్లే భారత్ అంతటి భారీ స్కోర్ చేసిందని భావిస్తున్న ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్, రెండో మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. అందుకే తొలి మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న జోఫ్రా ఆర్చర్‌ను ఇప్పుడు భారత్‌పై ప్రయోగించనుంది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడమే కాకుండా, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసి సిరీస్ వీరుడిగా నిలిచిన ఆర్చర్ ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతని రాకతో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఆర్చర్ సంధించే బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కోవడం భారత టాప్ ఆర్డర్‌కు నిజంగానే పెద్ద పరీక్ష కానుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..