AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. ఆ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్.. తొలి భారత ప్లేయర్‌గా..!

Kranti Gaud Cricket Record: మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువ పేసర్ ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి జాతీయ జట్టులోకి దూసుకొచ్చింది. గత టీ20 ప్రపంచ కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, తన ప్రాథమిక సూత్రాలకే కట్టుబడి రెడ్ బాల్ క్రికెట్‌లో ఈ స్థాయి ప్రదర్శన చేయడం నిజంగా అభినందనీయం. భారత మహిళల పేస్ విభాగానికి భవిష్యత్తు నమ్మకం తానేనని క్రాంతి గౌడ్ మరోసారి నిరూపించుకుంది.

లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. ఆ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్.. తొలి భారత ప్లేయర్‌గా..!
Kranti Gaud Becomes Youngest Indian Woman Pacer
Venkata Chari
|

Updated on: Jul 12, 2026 | 8:43 AM

Share

Kranti Gaud Cricket Record: క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో భారత యువ సంచలనం క్రాంతి గౌడ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఈ 22 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ఐదు వికెట్లతో చెలరేగి వరల్డ్ రికార్డులను తిరగరాసింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని అందుకుని, దిగ్గజ ఆటగాడు జులన్ గోస్వామి పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును క్రాంతి గౌడ్ తుడిచిపెట్టేసింది.

లార్డ్స్ పతాకంపై తొలి భారత మహిళా రత్నం..!

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల అధికారిక టెస్ట్ మ్యాచ్‌లోనే క్రాంతి గౌడ్ తన బౌలింగ్ పదును చూపించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను తన స్వింగ్, అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కంగారు పెట్టిస్తూ 5/37తో కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేసింది. లార్డ్స్ మైదానంలో ఏ ఫార్మాట్‌లోనైనా సరే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా క్రాంతి గౌడ్ రికార్డులకెక్కింది. ఈ అద్భుత ప్రదర్శనతో లార్డ్స్ పతాక బోర్డుపై ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ఇది కూడా చదవండి: బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్..

ఇవి కూడా చదవండి

దిగ్గజం జులన్ గోస్వామి రికార్డ్ బద్దలు..

కేవలం 22 సంవత్సరాల 333 రోజుల వయసులోనే క్రాంతి గౌడ్ ఈ అద్భుత మైలురాయిని అధిగమించింది. గతంలో 2005లో ఢిల్లీ వేదికగా ఇంగ్లాండ్‌పైనే 22 సంవత్సరాల 361 రోజుల వయసులో ఐదు వికెట్లు తీసిన జులన్ గోస్వామి పేరిట ఉన్న రికార్డును క్రాంతి తాజాగా అధిగమించింది. తద్వారా టెస్ట్ క్రికెట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించింది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను చిత్తు చేసిన వండర్ కిడ్..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 285 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు క్రాంతి గౌడ్ తన ఇన్‌స్వింగర్లతో చుక్కలు చూపించింది. ఓపెనర్ టామీ బ్యూమౌంట్‌ను పెవిలియన్‌కు పంపడంతో మొదలైన క్రాంతి వేట, ఆ తర్వాత ప్రమాదకరమైన మాయా బౌచియర్, అలిస్ కాప్సేలను క్లీన్ బౌల్ చేస్తూ సాగింది. ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. చివరికి లారెన్ బెల్ వికెట్ తీసి తన ఐదు వికెట్ల మైలురాయిని పూర్తి చేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

భారత్ భారీ ఆధిక్యం.. విజయానికి చేరువగా

క్రాంతి గౌడ్ సృష్టించిన విధ్వంసంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల విలువైన ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి, మొత్తంగా 269 పరుగుల భారీ ఆధిక్యంతో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (69 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో క్రీజులో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us