AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: లీగ్ ప్రారంభానికి ముందే గుజరాత్, బెంగళూరు జట్లకు భారీ షాక్.. టోర్నీ నుంచి ఇద్దరు ఔట్..

Kashvee Gautam - Kanika Ahuja: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 ఏళ్ల కనికా అహుజా ఒత్తిడి ఫ్రాక్చర్‌తో టోర్నమెంట్‌కు దూరంగా ఉందని ఫ్రాంచైజీ ధృవీకరించింది. ఆ తర్వాత స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు శ్రద్ధా పోఖార్కర్‌ను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.

WPL 2024: లీగ్ ప్రారంభానికి ముందే గుజరాత్, బెంగళూరు జట్లకు భారీ షాక్.. టోర్నీ నుంచి ఇద్దరు ఔట్..
WPL 2024
Venkata Chari
|

Updated on: Feb 20, 2024 | 7:23 PM

Share

Kashvee Gautam – Kanika Ahuja: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 రెండవ సీజన్ ప్రారంభానికి కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే, ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లకు బ్యాడ్ న్యూస్ ఉంది. భారత యువ స్టార్లు కశ్వీ గౌతమ్, కనికా అహుజా గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. డబ్ల్యూపీఎల్ వేలంలో యువ కశ్వీ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్లేయర్ డ్రాఫ్ట్ సమయంలో అన్‌క్యాప్ చేయని భారతీయ ప్లేయర్‌కు ఇది అత్యధిక బిడ్‌గా నిలిచింది. కశ్వీ నిష్క్రమణ తర్వాత, ముంబై ఆల్‌రౌండ్ స్టార్ సయాలీ సత్‌ఘరేని ఫ్రాంచైజీ భర్తీ చేసింది.

WPL రెండో సీజన్‌లో ఆడని మరో క్రీడాకారిణిగా కనికా అహుజా నిలిచింది. 21 ఏళ్ల కనికా రాబోయే సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇప్పుడు కనికా కూడా గాయం కారణంగా రాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్‌కు దూరంగా ఉంది. ఆమె స్థానంలో మహారాష్ట్ర ప్లేయర్ శ్రద్ధా పోఖార్కర్ RCB జట్టులో చేరింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 ఏళ్ల కనికా అహుజా ఒత్తిడి ఫ్రాక్చర్‌తో టోర్నమెంట్‌కు దూరంగా ఉందని ఫ్రాంచైజీ ధృవీకరించింది. ఆ తర్వాత స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు శ్రద్ధా పోఖార్కర్‌ను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.

తొలి సీజన్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. గత ఏడాది సీజన్ మొత్తం ముంబైలో కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో నిర్వహించారు. అయితే, ఈ సంవత్సరం బెంగళూరు, న్యూఢిల్లీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టోర్నీ తొలి భాగం దక్షిణాదిలో జరగనుంది. కాగా రెండో భాగం టోర్నీ ఢిల్లీలో జరగనుంది. అరుణ్ జైట్లీ స్టేడియం రెండో సీజన్‌ ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..