AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE T20s: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా.. పూర్తి వివరాలు ఇవే..

Team India jet off to Dublin for IND vs IRE T20s: ఐర్లాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఈ సిరీస్ కోసం ఐర్లాండ్‌కు వెళ్లింది. విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

IND vs IRE T20s: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఐర్లాండ్ బయల్దేరిన టీమిండియా.. పూర్తి వివరాలు ఇవే..
India Vs Ireland
Venkata Chari
|

Updated on: Aug 15, 2023 | 12:59 PM

Share

Team India jet off to Dublin for IND vs IRE T20s: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసింది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌లో తడబడింది. టీ20 సిరీస్ ఓటమి నుంచి భారత యువ జట్టు కొన్ని విషయాలు నేర్చుకుని కరీబియన్ టూర్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు మరో సిరీస్‌కి సిద్ధమైంది. ఆగస్టు 18 నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20ఐల సిరీస్ జరగనుంది. ఇప్పుడు ఈ సిరీస్ కోసం టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఐర్లాండ్ బయలుదేరింది.

జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌కు వెళ్లింది. భారత ఆటగాళ్లు విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో బుమ్రా, ప్రసీద్ధ్ కృష్ణ, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ సహా కొందరు ఆటగాళ్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఐర్లాండ్‌కు బయలుదేరిన టీమిండియా ఆటగాళ్ల ఫొటో:

ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉండడంతో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల టోర్నీ కావడంతో భారత యువ ఆటగాళ్లతో కోచింగ్ సిబ్బంది వెళ్లలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సహా కొంతమంది సిబ్బందికి ఈ పర్యటన నుంచి విశ్రాంతిని ఇచ్చారు.

కేకేఆర్ ట్వీట్..

ఐర్లాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇది ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. 2వ మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. ఇక చివరి 3వ టీ20 మ్యాచ్ ఆగస్టు 22న జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.

ఫ్యాన్స్ ట్వీట్..

ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్ టైటిల్ లభించింది. ప్రసీద్ధ్ కృష్ణ, శివమ్ దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ జట్టులో ఉన్నారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా వంటి సీనియర్‌ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి లభించింది.

సీఎస్‌కే ట్వీట్..

టీ20 టీమ్‌: జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ