AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharaja Trophy T20 2023: 5 సిక్సర్లు.. 9 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో చితక్కొట్టిన బ్యాటర్.. ఎన్ని బంతుల్లోనో తెలుసా?

Maharaja Trophy T20 2023: ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్ కనబర్చిన శరత్ మైసూర్ వారియర్స్ బౌలర్లు లయ కోల్పోయారు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న శరత్ గ్రౌండ్ మొత్తం సిక్స్-ఫోర్లు కొట్టాడు. ఫలితంగా కేవలం 57 బంతుల్లోనే శరత్ బ్యాట్‌తో భారీ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ తర్వాత శరత్ మెరుపులు మెరిపిస్తూ 61 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో అజేయంగా 111 పరుగులు చేశాడు.

Maharaja Trophy T20 2023: 5 సిక్సర్లు.. 9 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో చితక్కొట్టిన బ్యాటర్.. ఎన్ని బంతుల్లోనో తెలుసా?
Sharath Br
Venkata Chari
|

Updated on: Aug 16, 2023 | 6:52 AM

Share

Maharaja Trophy T20 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మహారాజా ట్రోఫీ T20 టోర్నమెంట్‌లో 5వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మైసూర్ వారియర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బీఆర్ శరత్ మెరుపు సెంచరీతో మంగళూరు డ్రాగన్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మంగళూరు డ్రాగన్స్ కెప్టెన్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ జట్టుకు కార్తీక్ (29), సమర్థ్ (14) శుభారంభం అందించారు.

4 ఓవర్లలో 41 పరుగులు చేసి సమర్థ్ ఔటయ్యాడు. ఈ సందర్భంగా బరిలోకి దిగిన కెప్టెన్ కరుణ్ నాయర్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. మంగళూరు బౌలర్లపై కరుణ్ సిక్స్, ఫోర్ల వర్షం కురిపించాడు.

ఇవి కూడా చదవండి

శరత్ సెంచరీ ఇన్నింగ్స్‌..

అలాగే కరుణ్ నాయర్ కేవలం 39 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 77 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో మైసూర్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

మంగళూరు డ్రాగన్స్ విజయం..

202 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మంగళూరు డ్రాగన్స్‌కు ఓపెనర్ రోహన్ పాటిల్ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. మూడో ఆర్డర్ లో అడుగుపెట్టిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బీఆర్ శరత్ రెచ్చిపోయాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..

ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్ కనబర్చిన శరత్ అబ్బరానికి మైసూర్ వారియర్స్ బౌలర్లు లయ కోల్పోయారు. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న శరత్ గ్రౌండ్ మొత్తం సిక్స్-ఫోర్లు కొట్టాడు. ఫలితంగా కేవలం 57 బంతుల్లోనే శరత్ బ్యాట్ తో భారీ సెంచరీ నమోదు చేశాడు.

లీడింగ్ రన్ స్కోరర్..

సెంచరీ తర్వాత శరత్ మెరుపులు మెరిపిస్తూ 61 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో అజేయంగా 111 పరుగులు చేశాడు. దీంతో 18.5 ఓవర్లలో మంగళూరు డ్రాగన్స్ జట్టు విజేతగా నిలిచాడు.

టోర్నీలో టాప్ స్కోరర్..

మైసూర్ వారియర్స్ ప్లేయింగ్ 11: రవికుమార్ సమర్థ్, కోదండ అజిత్ కార్తీక్, కరుణ్ నాయర్ (కెప్టెన్), రాహుల్ రావత్, తుషార్ సింగ్, శివకుమార్ రక్షిత్ (వికెట్ కీపర్), మనోజ్ భాండాగే, జగదీస్ సుచిత్, శ్రీషా ఆచార్, మురళీధర వెంకటేష్, మోనీష్ రెడ్డి.

మంగళూరు డ్రాగన్స్ ప్లేయింగ్ 11: నికిన్ జోస్, శరత్ బిఆర్ (వికెట్ కీపర్), కృష్ణమూర్తి సిద్ధార్థ్, అనిరుధ్ జోషి, ధీరజ్ జె గౌడ, కృష్ణప్ప గౌతం (కెప్టెన్), ఆనంద్ దొడ్డమణి, అనిశ్వర్ గౌతమ్, ఆదిత్య గోయల్, ప్రతీక్ జైన్, నవీన్ ఎంజి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..