AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం ప్రణాళికలు.. కెప్టెన్ల కోసం ఆ ఫ్రాంచైజీల కసరత్తు..

ఈ సీజన్ నుంచి పది జట్లు ఐపీఎల్‌ 2022(ipl 2022)లో పాల్గొననున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి మెగా వేలం(IPl 2022 mega auction)పై ఉంది...

IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం ప్రణాళికలు.. కెప్టెన్ల కోసం ఆ ఫ్రాంచైజీల కసరత్తు..
Ipl 2022 Ahmedabad
Srinivas Chekkilla
|

Updated on: Feb 08, 2022 | 9:05 AM

Share

ఈ సీజన్ నుంచి పది జట్లు ఐపీఎల్‌ 2022(ipl 2022)లో పాల్గొననున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి మెగా వేలం(IPl 2022 mega auction)పై ఉంది. జట్లు గరిష్ఠంగా నలుగురు, కనిష్ఠంగా ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం వల్ల ఈ వేలం తర్వాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు మారిపోనున్నాయి. అందుకే జట్టులోకి ఏ ఆటగాడిని తీసుకోవాలి? ఎవరి కోసం ఎన్ని రూ.కోట్లు వెచ్చించాలి? ఎలా కొత్త సారథిని సొంతం చేసుకోవాలి? అనే వ్యూహాల్లో ఫ్రాంఛైజీలు నిమగ్నమయ్యాయి. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే మెగా వేలంలో అనుసరించాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యంగా కొత్త కెప్టెన్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR), పంజాబ్‌ కింగ్స్‌ కసరత్తు చేస్తున్నాయి.

విదేశీ ఆటగాళ్లలో మోర్గాన్‌, కమిన్స్‌, డికాక్‌, డుప్లెసిస్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, జేసన్‌ హోల్డర్‌.. భారత క్రికెటర్లలో అశ్విన్‌, ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌, భువనేశ్వర్‌, శ్రేయస్‌ అయ్యర్‌లలో కొందరికి కెప్టెన్లు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి వీళ్లలో ఆ జట్లు ఏ ఆటగాళ్లను దక్కించుకుంటాయన్నది చూడాలి. గత ఎనిమిది సీజన్లుగా ఆర్సీబీని నడిపించిన విరాట్‌ కోహ్లీ గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం నుంచి అదే జట్టుతో ఉన్న అతను.. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

శ్రేయస్‌ కోసం ఆ జట్టు ఏకంగా రూ.20 కోట్లు పెట్టేందుకు సిద్ధమైందన్న వార్తలు వచ్చాయి. కానీ ఒక్క ఆటగాడి కోసం అంత చెల్లిస్తారా? అన్నది అనుమానమే. ఆ జట్టు ఇప్పటికే అట్టిపెట్టుకున్న కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ల కోసం రూ.33 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.57 కోట్లున్నాయి. మరోవైపు వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌, అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ను వేలంలో దక్కించుకోవాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అతను గొప్పగా రాణిస్తున్నాడు. దీంతో అతని కోసం జట్టు రూ.12 కోట్ల వరకూ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.

అంబటి రాయుడు, రియాన్‌ పరాగ్‌లపైనా ఆ జట్టు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. “స్టోక్స్‌ అందుబాటులో లేడు. హార్దిక్‌, స్టాయినిస్‌ కొత్త జట్లలోకి వెళ్లారు. గాయాల కారణంగా మిచెల్‌ మార్ష్‌ పూర్తి సీజన్‌ ఆడతాడో లేడో చెప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌గా హోల్డర్‌కు డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా అంబటి రాయుడు కోసం రూ.8 కోట్లు, రియాన్‌ పరాగ్‌కు రూ.7 కోట్ల వరకూ చెల్లించేందుకు సిద్ధమైంది” అని ఆర్సీబీ సమాచార వర్గాలు పేర్కొన్నాయి. ఇక వచ్చే సీజన్లో కొత్త కెప్టెన్ల అవసరం ఉన్న మరో రెండు జట్లు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌. గతేడాది జట్టును ఫైనల్‌ చేర్చినప్పటికీ మోర్గాన్‌ను కేకేఆర్‌ వదులుకుంది. రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌లను అట్టిపెట్టుకుంది.

మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ను కూడా వదులుకున్న ఆ జట్టుకు ఇప్పుడు ఓ సారథి కావాలి. ఇక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్‌ విజేతగా నిలవని పంజాబ్‌ కింగ్స్‌ కూడా నూతన నాయకుడి కోసం చూస్తోంది. గత రెండు సీజన్లలోనూ కెప్టెన్‌గా బ్యాటింగ్‌తో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌.. ఇప్పుడు కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ సారథిగా ఎంపికయ్యాడు. మరోవైపు ఆ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ మాత్రమే జట్టుతో ఉన్నారు. రూ.72 కోట్లతో వేలంలో దిగనున్న ఆ జట్టు.. సరైన కెప్టెన్‌ కోసం భారీగానే చెల్లించే అవకాశం ఉంది.

Read Also.. IND vs WI: రెండో వన్డేలో ఓపెనర్‌గా ఇషాన్ డౌట్.. రోహిత్‌తో ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరంటే?