AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: చివరి మ్యాచ్ ఎప్పుడో ఆడేసిన ఆ స్పెషల్ ప్లేయర్.. ఇకపై ఐపీఎల్ జెర్సీ ధరించడం కష్టమే..

IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరేందుకు 8 జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఓ ప్లేయర్ గురించి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇకపై ఇప్పటికీ ఐపీఎల్ మైదానంలో ఈ ప్లేయర్ కనిపించడు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL: చివరి మ్యాచ్ ఎప్పుడో ఆడేసిన ఆ స్పెషల్ ప్లేయర్.. ఇకపై ఐపీఎల్ జెర్సీ ధరించడం కష్టమే..
Ananya Bangar
Venkata Chari
|

Updated on: May 05, 2025 | 11:28 AM

Share

IPL 2025: ఐపీఎల్ 2025 (IPL 2025) ప్రస్తుతం ప్లే-ఆఫ్స్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. కానీ ఇంతలో, క్రికెట్ ప్రపంచానికి సంబంధించిన ఒక కీలక వార్త బయటకు వచ్చింది. ఒక ఆటగాడు మళ్ళీ ఐపీఎల్ జెర్సీ ధరించి కనిపించడు. అసలు ఎవరు, ఎందుకు ఇకపై ఐపీఎల్ ఆడడు అనే విషయలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ క్రికెటర్ ఐపీఎల్ ఆడలేడు..

సంజయ్ బంగర్ ఒక లెజెండ్‌గా మనకు తెలుసు. మాజీ క్రికెటర్ కూతురు అనన్య బంగర్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. సంజయ్ బంగర్ కూతురు అనన్య అంతకుముందు అబ్బాయి అని తెలిసిందే. కానీ, ఇప్పుడు అతను తన జెండర్‌ను మార్చుకున్నాడు. దీంతో ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయింది. సమాచారం ప్రకారం, ఆమె రెండు సంవత్సరాల క్రితం హార్మోన్స్ చికిత్స చేయించుకుంది. ఆ తర్వాత ఆమె చాలా కాలం లండన్‌లో ఉండిపోయింది. అనన్య బంగర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసి, తాను క్రికెట్ ఆడలేనని పేర్కొంది.

ECB కీలక నిర్ణయం..

అనన్య బంగర్ పోస్ట్ ECB కి వ్యతిరేకంగా ఉంది. వాస్తవానికి, ECB అంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు లింగమార్పిడి ఆటగాళ్లను మహిళలు, బాలికల మ్యాచ్‌లలో పాల్గొనకుండా నిషేధించాలని నిర్ణయించింది. మహిళల చట్టపరమైన నిర్వచనం నుంచి ట్రాన్స్‌జెండర్లను మినహాయించిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చట్టపరమైన స్థితిని అనుసరించి ట్రాన్స్‌జెండర్ క్రీడాకారుల అర్హతపై దాని నియమాలలో మార్పులను ప్రకటిస్తున్నట్లు ఈసీబీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

‘తక్షణమే, జీవసంబంధమైన లైంగిక సంబంధం కలిగిన క్రీడాకారిణులు మాత్రమే మహిళల క్రికెట్, బాలికల క్రికెట్ మ్యాచ్‌లలో ఆడటానికి అర్హులు.’ ట్రాన్స్‌జెండర్ మహిళలు బాలికలు ఓపెన్, మిక్స్‌డ్ క్రికెట్ ఆడటం కొనసాగించవచ్చు అని పేర్కొంది.

సోషల్ మీడియాలో స్వరం పెంచిన అనన్య..

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడం ద్వారా అనన్య బంగర్ ట్రాన్స్‌జెండర్లకు అనుకూలంగా తన స్వరాన్ని పెంచింది. ఆమె పోస్ట్‌లో – ‘ ఈసీబీ అధికారికంగా ట్రాన్స్ మహిళలు ప్రొఫెషనల్ క్రికెట్‌లో మాత్రమే కాకుండా అట్టడుగు స్థాయిలలో కూడా పాల్గొనకుండా నిషేధించింది’ అంటూ రాసుకొచ్చింది. ‘నేను కేవలం ట్రాన్స్ జెండర్ అమ్మాయిని కాదు, క్రికెటర్‌లో నేను వివక్ష, వేధింపులు ఎదుర్కొన్నాను. పిచ్‌ని కంట్రోల్ చేయగలరు, కానీ వాళ్ళు మా భావోద్వేగాలను ఎప్పటికీ కంట్రోల్ చేయలేరు. ఇది మా ఇన్నింగ్స్‌కు ముగింపు కాదంటూ’ చెప్పుకొచ్చింది.

ఐసీసీ కీలక నిర్ణయం..

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా ఐసీసీ అంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా నిషేధం విధించింది. కానీ ఐసీసీ ఈ నియమాన్ని దేశీయ క్రికెట్‌లో అమలు చేయలేదు. బోర్డులు కోరుకుంటే, వారు తమ దేశీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులను చేర్చుకోవచ్చు. కానీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు దేశవాళీ మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులను చేర్చకూడదని నిర్ణయించింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..