Rohit sharma: ముంబై ఇండియన్స్ క్యాంప్లో చేరని రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2024లో ఆడేనా?
Rohit sharma, IPL 2024: ధర్మశాలలో ఆడిన చివరి టెస్ట్లో రోహిత్ 103 పరుగులు చేశాడు. అయితే ఆ టెస్ట్ మూడో రోజు వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ ఫీల్డింగ్కు రాలేదు. అతని గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా కమాండ్ తీసుకున్నాడు. టెస్టు సిరీస్ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. రోహిత్ ఇప్పుడు ఐపీఎల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెప్టెన్సీలో ఐదుసార్లు ముంబై ఛాంపియన్గా నిలిచిన రోహిత్ ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఐపీఎల్ 2024 కోసం హార్దిక్ను గుజరాత్ టైటాన్స్కు ఫ్రాంచైజీ ట్రేడ్ చేసింది. రోహిత్ స్థానంలో కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించింది.

Rohit sharma, IPL 2024: రోహిత్ శర్మ ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో ఇంకా చేరలేదు. ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. గాయం తర్వాత అతను జట్టులో ఎప్పుడు చేరేది అధికారింగా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం రోహిత్ ముంబై జట్టులో ఎప్పుడు చేరతాడో తెలిసింది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్లో మూడో రోజు వెన్నునొప్పి కారణంగా రోహిత్ మైదానంలోకి దిగలేదు. ఆయన వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పుడు గాయం తర్వాత అతను మైదానంలోకి తిరిగి వచ్చే తేదీని వెల్లడించారు.
ఓ వెబ్ సైట్ ప్రకారం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ మార్చి 18 సోమవారం జట్టు శిక్షణ శిబిరంలో చేరవచ్చు. ముంబైలో శిక్షణ శిబిరం చాలా రోజుల క్రితం ప్రారంభమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ సహా పలువురు స్టార్ ప్లేయర్లు క్యాంప్లో చెమటలు పట్టిస్తున్నారు, అయితే టెస్టు సిరీస్ ముగిసిన చాలా రోజుల తర్వాత కూడా రోహిత్ జట్టులో చేరలేదు. ఇప్పుడు, లీగ్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందు, అతను జట్టులో చేరడంపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది.
రోహిత్ ఎప్పుడు ముంబై క్యాంపులో చేరతాడు?
ఓ మూలం ప్రకారం, రోహిత్ చాలాకాలం పాటు జాతీయ విధుల్లో ఉన్నాడు. అందుకే అతను విరామం తీసుకున్నాడు. అయితే రోహిత్ మార్చి 18 న శిబిరంలో చేరే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాత, అతను ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల T20 హోమ్ సిరీస్లో, ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల హోమ్ సిరీస్లో బిజీ అయ్యాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ జనవరి 25 నుంచి మార్చి 10 మధ్య జరిగింది. ఈ సిరీస్లో రోహిత్ రెండు సెంచరీలు సాధించాడు.
పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ ఆడతాడా?
ధర్మశాలలో ఆడిన చివరి టెస్ట్లో రోహిత్ 103 పరుగులు చేశాడు. అయితే ఆ టెస్ట్ మూడో రోజు వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ ఫీల్డింగ్కు రాలేదు. అతని గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా కమాండ్ తీసుకున్నాడు. టెస్టు సిరీస్ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. రోహిత్ ఇప్పుడు ఐపీఎల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెప్టెన్సీలో ఐదుసార్లు ముంబై ఛాంపియన్గా నిలిచిన రోహిత్ ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఐపీఎల్ 2024 కోసం హార్దిక్ను గుజరాత్ టైటాన్స్కు ఫ్రాంచైజీ ట్రేడ్ చేసింది. రోహిత్ స్థానంలో కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించింది. మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో ముంబై జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




