AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!

Virat Kohli Gets Rs 10,000 Player of the Match Award: విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన పోరులో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ తర్వాత అతనికి లభించిన 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు నగదు బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli: విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!
Virat Kohli Century
Venkata Chari
|

Updated on: Dec 26, 2025 | 9:02 PM

Share

Virat Kohli Gets Rs 10,000 Player of the Match Award: టీమ్ ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై సెంచరీ (131) బాదిన విరాట్, శుక్రవారం గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్..

బెంగళూరులోని అలుర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ కేవలం 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 126గా ఉండటం విశేషం. కోహ్లీతో పాటు రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 254 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ జట్టును 247 పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ, 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రూ. 10 వేల బహుమతి – వెల్లువెత్తిన ట్రోల్స్..

మ్యాచ్ అనంతరం అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (Player of the Match) అవార్డు వరించింది. అయితే, అతనికి నగదు బహుమతిగా కేవలం రూ. 10,000 (పది వేల రూపాయలు) మాత్రమే అందజేశారు.

కోట్లాది రూపాయల ఆస్తులు, వందల కోట్ల సంపాదన ఉన్న విరాట్ కోహ్లీ చేతిలో రూ. 10 వేల చెక్కును చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ (BCCI), ఒక దిగ్గజ ఆటగాడికి ఇంత తక్కువ బహుమతి ఇవ్వడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

సోషల్ మీడియా స్పందన..

“కోహ్లీ కారు సర్వీసింగ్‌కు కూడా ఈ డబ్బు సరిపోదు” అని ఒకరు, “బీసీసీఐకి అంత కరువు వచ్చిందా?” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, దేశవాళీ క్రికెట్ నిబంధనల ప్రకారం విజయ్ హజారే ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు నిర్ణీత బహుమతి రూ. 10 వేలే ఉంటుంది. కానీ, కోహ్లీ లాంటి అంతర్జాతీయ స్టార్ ఆడుతున్నప్పుడు ఈ మొత్తం చాలా చిన్నదిగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా, మైదానంలో కోహ్లీ పరుగుల దాహం మాత్రం తగ్గలేదు. త్వరలో జరగనున్న అంతర్జాతీయ సిరీస్‌ల కంటే ముందు విరాట్ ఇలాంటి ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు సానుకూల అంశం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..