AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?

టీ20 వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు జట్ల మధ్య తేడాను నిర్ణయించేది నెట్ రన్ రేట్ (NRR). భారత్ సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల NRR తీవ్రంగా పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారీ విజయాలతో తమ NRRను బలంగా ఉంచుకున్నాయి.

IND vs ZIM: సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
India Vs Zimbabwe T20i Wc
Venkata Chari
|

Updated on: Feb 26, 2026 | 9:38 PM

Share

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 గ్రూప్-1 దశలో భారత్‌కు జింబాబ్వేతో జరగనున్న 48వ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ పరిస్థితిని తీసుకొచ్చింది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన భారీ ఓటమి వల్ల భారత్ నెట్ రన్ రేట్ (NRR) తీవ్రంగా పడిపోయింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ కేవలం గెలవడమే కాదు, భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. అభిషేక్ శర్మ 55, హార్దిక్ పాండ్యా అజేయంగా 50, తిలక్ వర్మ అజేయంగా 44 పరుగులు చేయడం వల్ల భారత జట్టు 256 పరుగులు సాధించగలిగింది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం, జింబాబ్వేపై భారత్ సుమారు 77 పరుగుల తేడాతో గెలిస్తేనే నెట్ రన్ రేట్‌లో గణనీయమైన మెరుగుదల వచ్చి, గ్రూప్‌లో పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. అంటే చిన్న తేడాతో గెలిస్తే సరిపోదు – భారీ విజయం తప్పనిసరి. అంటే, భారత జట్టు జింబాబ్వేను 179 పరుగులకే పరిమితం చేయాల్సి ఉంది.

నెట్ రన్ రేట్ ఎందుకు కీలకం?

టీ20 వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు జట్ల మధ్య తేడాను నిర్ణయించేది నెట్ రన్ రేట్ (NRR). భారత్ సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల NRR తీవ్రంగా పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారీ విజయాలతో తమ NRRను బలంగా ఉంచుకున్నాయి.

ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో భారత్ పెద్ద తేడాతో గెలిస్తేనే ప్రత్యర్థులతో పోలిస్తే NRRను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. అందుకే జింబాబ్వేపై సుమారు 77 పరుగుల తేడాతో గెలవాల్సిన అవసరం ఏర్పడింది.

48వ మ్యాచ్ – భారత్‌కు అసలైన పరీక్ష

సూపర్-8 గ్రూప్-1లోని 48వ మ్యాచ్ భారత్‌కు కీలక మలుపు. జింబాబ్వే ఇప్పటికే ఈ టోర్నీలో పెద్ద జట్లను షాక్‌కు గురిచేసిన అనుభవం కలిగి ఉంది.

సెమీఫైనల్ దారి ఇంకా తెరిచే ఉంది..

భారత్ సెమీఫైనల్ చేరే అవకాశాలు ఇంకా పూర్తిగా ముగియలేదు. కానీ ఇప్పుడు ప్రతి ఓవర్, ప్రతి రన్ కీలకం. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిస్తేనే గ్రూప్-1లో భారత్ పోటీలో నిలుస్తుంది.

Follow Us
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..
చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్
చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్
జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్
జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్
ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా? ఆరోగ్యానికి బంగారంలాంటి..
ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా? ఆరోగ్యానికి బంగారంలాంటి..
విశాఖ సముద్ర తీరంలో మిలాన్ 2026 విజయవంతం.. భారత్ నావికా సత్తా
విశాఖ సముద్ర తీరంలో మిలాన్ 2026 విజయవంతం.. భారత్ నావికా సత్తా
చనిపోతాననుకున్నా.. ఇప్పుడు ఆయన వల్లే బతికున్నా: జబర్దస్త్ రాజమౌళి
చనిపోతాననుకున్నా.. ఇప్పుడు ఆయన వల్లే బతికున్నా: జబర్దస్త్ రాజమౌళి
ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.1.25 లక్షల లోన్‌!
ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.1.25 లక్షల లోన్‌!