IPL 2024: ఆ కుటుంబంలో కన్నీళ్లను మిగిల్చిన ఐపీఎల్.. రోహిత్ ఫ్యాన్స్ దాడిలో గాయపడిన సీఎస్కే అభిమాని మృతి

విషాదాన్ని నింపింది. రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఒక వ్యక్తి తల పగలకొట్టారు. అతను గత రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు వదిలాడు. మరణించిన వ్యక్తి కూడా చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని కావడం గమనార్హం

IPL 2024: ఆ కుటుంబంలో కన్నీళ్లను మిగిల్చిన ఐపీఎల్.. రోహిత్ ఫ్యాన్స్ దాడిలో గాయపడిన సీఎస్కే అభిమాని మృతి
IPL 2024
Follow us

|

Updated on: Mar 31, 2024 | 9:23 PM

ఐపీఎల్ ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఒక వ్యక్తి తల పగలకొట్టారు. అతను గత రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు వదిలాడు. మరణించిన వ్యక్తి కూడా చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని కావడం గమనార్హం. మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటను కేవలం వినోదంగా చూడాలని, ఇలా ఓ వ్యక్తిని కొట్టి చంపడం దారుణమంటూ క్రికెట్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు బందుపంత్ బాపుసో తిబిలే , సాగర్ జాంగే, బల్వంత్ జాంగే లతో కలిసి బుధవారం (మార్చి 27) రాత్రి 10 గంటల సమయంలో IPL మ్యాచ్‌ (సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్) ని చూస్తున్నారు. హైదరాబాద్ ఇచ్చిన 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు అద్భుత శుభారంభం అందించారు. అయితే అతి తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడ్డాయి.ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ పతనం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని షాక్ కు గురి చేసింది. రోహిత్ ఔట్ చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. దీంతో సాగర్ జంజా, బల్వంత్ జంజా ఇద్దరూ నిరాశకు గురయ్యారు. కానీ అక్కడే కూర్చున్న సీఎస్‌కే అభిమాని బందుపంత్ టిబిలే రోహిత్ ఔట్‌తో సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన సాగర్ జంజా, బల్వంత్ జంజాలకు కోపం వచ్చింది. వెంటనే వీరిద్దరూ బండుపంత్‌తో వాగ్వాదానికి దిగారు.

క్రమేపీ ఈ గొడవ ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే గొడవ తీవ్రరూపం దాల్చడంతో సాగర్, బల్వంత్ పక్కనే కర్రలు అందుకుని బండుపంత్‌ తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో బండుపంత్ చెవులు, ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది. తీవ్రంగా గాయపడిన బందుపంత్ టిబిలేను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక మూడు రోజుల తర్వాత అంటే ఆదివారం మృతి చెందాడు. టిబిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, అల్లుడు, కొడుకు, మనుమలు, సోదరులు, సోదరీమణులు ఉన్నారు. నిందితులు సాగర్ జాంగే, బల్వంత్ జాంగేలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!