AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: కోహ్లీ, రోహిత్‌లను పక్కన నెట్టేశారు.. ఇకపై టీ20లలో కింగ్‌లు వీరే.. లిస్టులో హైదరాబాదీ.!

ఐపీఎల్ 2023లో సీనియర్లతో పోటీపడి మరీ యువ ప్లేయర్స్ తన సత్తాను చాటుకున్నారు. ఒకరు ఓపెనర్‌గా పరుగుల వరద పారిస్తే.. మరొకరు మిడిలార్డర్‌లో జట్టుకు బలంగా నిలిచారు.

IPL 2023: కోహ్లీ, రోహిత్‌లను పక్కన నెట్టేశారు.. ఇకపై టీ20లలో కింగ్‌లు వీరే.. లిస్టులో హైదరాబాదీ.!
Ipl 2023
Ravi Kiran
|

Updated on: May 30, 2023 | 11:30 AM

Share

ఐపీఎల్ 2023లో సీనియర్లతో పోటీపడి మరీ యువ ప్లేయర్స్ తన సత్తాను చాటుకున్నారు. ఒకరు ఓపెనర్‌గా పరుగుల వరద పారిస్తే.. మరొకరు మిడిలార్డర్‌లో జట్టుకు బలంగా నిలిచారు. ఇంకొకరు ఫినిషర్‌గా తన జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ఒక్క బ్యాటింగ్ మాత్రమే కాదు.. బౌలింగ్‌లోనూ అదరగొట్టారు భారత యువ పేసర్లు.. టీమిండియా భవిష్యత్తుకు బాటలు వేస్తూ.. కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్ అయినా పర్లేదు.. మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నారు. మరి ఆ యంగ్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూసేద్దామా..

  • యశస్వి జైస్వాల్:

రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్. ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల వరద పారించాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని సైతం మనోడు తన పేరు మీద రాసుకున్నాడు.

  • సాయి సుదర్శన్, తిలక్ వర్మ:

ఈ ఇద్దరు మిడిలార్డర్ బ్యాటర్లు తమ జట్లు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టి పునాదిని వేయడంలో దిట్టలు. నిలకడకు మరో పేరుగా మారిన ఈ ఇద్దరూ.. కావాల్సినప్పుడల్లా స్ట్రైక్ రొటేషన్ చేస్తూ పరుగులు చేయడమే కాదు.. గేర్ మార్చి ప్రత్యర్ధులపై శివతాండవం కూడా చేసేస్తారు. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో తిలక్ వర్మ ఇన్నింగ్స్ యువరాజ్‌ను తలపిస్తే.. ఫైనల్‌లో సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ సురేష్ రైనాను గుర్తు చేసింది.

  • రింకూ సింగ్:

ఈ సీజన్‌లో మనోడికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.. కేకేఆర్‌కు ఎప్పుడూ నమ్మిన బంటులా ఉన్నాడు రింకూ సింగ్. అయితే ఈసారి ప్రమోషన్ వచ్చింది. ఆ జట్టుకు ఫినిషర్‌గా మారి.. నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో వరుసగా 5 సిక్సర్లు బాది కేకేఆర్‌కు సూపర్ విక్టరీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

వీరితో పాటు విష్ణు వినోద్, ధృవ్ జురెల్, జితేష్ శర్మ, నేహల్ వదేరా, సుయాష్ శర్మ, ఆకాష్ మద్వాల్, అభిషేక్ శర్మ లాంటి యువ ప్లేయర్స్ ఆట.. అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు యశస్వి జైస్వాల్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. త్వరలోనే అతడు రెగ్యులర్ టెస్ట్ టీంలో భాగం అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అటు త్వరలోనే జరగబోయే టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ, రింకూ సింగ్‌లు కూడా టీమిండియాలో భాగం కావచ్చు.