Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

32 బంతుల్లో సెంచరీ.. 7ఫోర్లు.. 11 సిక్సర్లు.. టీ10లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ‘ఇండియన్’ బ్యాట్స్‌మెన్

10 ఓవర్ల మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్ మొత్తం 23 సిక్సర్లు, 24 ఫోర్లు బాదేశారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు.

32 బంతుల్లో సెంచరీ.. 7ఫోర్లు.. 11 సిక్సర్లు.. టీ10లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన 'ఇండియన్' బ్యాట్స్‌మెన్
Ecs T10
Follow us
Venkata Chari

|

Updated on: Aug 10, 2021 | 1:23 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌లో అనేక ఫార్మాట్లలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇంగ్లండ్‌లో భారత్- ఇంగ్లండ్ టీంల మధ్య టెస్ట్ క్రికెట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే టీ 20 సిరీస్‌లో బంగ్లాదేశ్-ఆస్ట్రేలియాల టీంలు తలపడ్డాయి. అదే సమయంలో ఇంగ్లండ్‌లో ది హండ్రెడ్ (100-బాల్ టోర్నమెంట్) జరుగుతోంది. వీటన్నింటితో పాటు టీ10 క్రికెట్ కూడా యూరోపియన్ దేశమైన హంగేరీలో జరిగింది. ఇది భారీ విజయాన్ని కూడా సాధించింది. ఆగస్టు 9 న ఇక్కడ జరిగిన ఓ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. మెల్మోస్ అనే జట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్లకు 171 పరుగులు సాధించింది. బ్యాట్స్‌మెన్ అంకిత్ గుప్తా సునామీ లాంటి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ నమోదు చేశాడు. గుప్తా 32 బంతుల్లో 7 ఫోర్లు మరియు 11 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ల్యాండ్‌స్క్రోనా జట్టు ఐదు వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆ జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌మోహస్ జట్టు ఇన్నింగ్స్ మొదటి బంతికే తమ ఓపెనర్ సంబిత్ పట్నాయక్ వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అంకిత్ గుప్తా రెండవ ఓపెనర్ ధీరజ్ మల్హోత్రా (58)తో కలిసి గ్రౌండ్లో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేవలం 54 బంతుల్లోనే సాధించడం విశేషం. ధీరజ్ మల్హోత్రా 24 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. అదే సమయంలో, అంకిత్ గుప్తా 325 స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే ఈ ఇద్దరు మినహా ఏ ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రెండు డిజిట్లకు చేరుకోలేకపోయాడు. మెహమహాస్‌కు ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. ఇందులో ఇద్దర్ని సున్నాకే పెవిలియన్ చేర్చాడు. మరో బ్యాట్స్‌మెన్ ఒక పరుగు మాత్రమే సాధించగలిగాడు.

ల్యాండ్‌స్క్రోనా జట్టు ప్రధాన బౌలర్ అమృతంషు సింగ్ ఈ పరుగుల వరదలో ఆకట్టుకోగలిగేలా బౌలింగ్ చేశాడు. అతను తన రెండు ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనికేత్ ఖర్డే ఒకే ఓవర్‌లో 33 పరుగులు ఇవ్వగా, సుశాంత్ కుమార్ దేవత ఒక ఓవర్‌లో 29 పరుగులు ఇచ్చాడు.

లక్ష్యం చేరని ల్యాండ్‌స్క్రోనా జట్టు .. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ల్యాండ్‌స్క్రోనా జట్టు బ్యాట్స్‌మెన్ ధాటిగానే బ్యాటింగ్ ప్రారభించారు. కానీ భారీ ఇన్నింగ్స్ నెలకొల్పలేకపోవడంతో లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. తుసిఫ్ వలయత్ అత్యధికంగా 46 పరుగులు సాధించాడు. ఇందులో 17 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో, మహమ్మద్ హనీఫ్ 18 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 34 పరుగులు సాధించాడు. చివరికి ఆజట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read: Paris Olympics 2024: పారిస్‌ చేరిన ఒలింపిక్‌ జెండా.. శరవేగంగా పనులు: పారిస్‌ మేయర్‌ హిడాల్గో

Heartbreaking Olympics: ఒలింపిక్స్‌‌లో పతకానికి దగ్గరకు వచ్చి.. లాస్ట్‌లో మిస్ చేసుకున్న భారత రెజ్లర్లు వీరే..