Asia Cup 2022: యూఏఈలోనే ఆసియా కప్ 2022.. ఆర్థిక సంక్షోభంతో చేతులెత్తేసిన శ్రీలంక..

India vs Pakistan: శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఆహార పానీయాల కొరతతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఉంది. అంతేకాదు శ్రీలంకలో రాజకీయ దుమారం రేగుతోంది.

Asia Cup 2022: యూఏఈలోనే ఆసియా కప్ 2022.. ఆర్థిక సంక్షోభంతో చేతులెత్తేసిన శ్రీలంక..
Asia Cup 2022
Follow us

|

Updated on: Jul 28, 2022 | 7:15 AM

Asia Cup 2022: ఆసియా కప్ 2022 శ్రీలంకలో కాకుండా UAEలో జరగనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 27న ప్రారంభమై.. సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. తొలుత ఆసియా కప్ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే ఈ సమయంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశమంతా గందరగోళంగా తయారైంది. శ్రీలంక ఆహారం, పానీయాల కొరతతో పోరాడుతోంది. అంతేకాదు పెట్రోలు, డీజిల్‌కు కూడా గణనీయమైన కొరత ఏర్పడింది. గతంలో శ్రీలంక ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా కూడా నిరసనకారులు స్టేడియంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

16 రోజుల టోర్నీ..

క్లిష్ట పరిస్థితుల్లో కూడా, శ్రీలంక క్రికెట్ బోర్డు ముందుగా ఆసియా కప్‌ను నిర్వహించడానికి కష్టపడుతోంది. అయితే, ప్రస్తుతం మీడియా నివేదికల ప్రకారం.. టోర్నమెంట్ శ్రీలంకకు బదులుగా యుఏఈలో నిర్వహించనున్నారు. అయితే, 16 రోజుల పాటు జరిగే ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించవచ్చని గతంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన్ డిసిల్వా సూచించారు. ఆసియా కప్‌లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ సహా మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. ఒక జట్టు క్వాలిఫైయింగ్ జట్టుగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు సమాచారం..

ఆగస్టు 20 నుంచి క్వాలిఫయింగ్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇందులో హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ జట్లు పాల్గొంటాయి. ఇటీవల బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా యూఏఈలో ఆసియా కప్ ఆడనున్నట్టు తెలిపాడు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి లేదని శ్రీలంక బోర్డు ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు తెలిపింది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంక ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌ను కూడా వాయిదా వేసింది.

భారత్, పాకిస్థాన్‌ల పోరుపైనే ఆసక్తి..

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు ముఖాముఖిగా తలపడనున్నాయి. అయితే అంతకు ముందు రెండు జట్లు ఇప్పుడు యూఏఈలో తలపడనున్నాయి. వీరిద్దరి మధ్య ఆగస్టు 28న మ్యాచ్ జరగనుంది. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. దీని తర్వాత అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. భారత్ 6 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. గతసారి బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..