Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2022: 88 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ప్రస్థానం.. తొలి పతకం నుంచి గతేడాది రికార్డులు ఇవే..

ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ జులై 28 నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి మొత్తం 322 మంది సభ్యుల బృందం ఈ క్రీడల కోసం వెళ్లారు.

Commonwealth Games 2022: 88 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ప్రస్థానం.. తొలి పతకం నుంచి గతేడాది రికార్డులు ఇవే..
India At Commonwealth Games (1)
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2022 | 1:06 PM

India at Commonwealth Games: మొదటి కామన్వెల్త్ క్రీడలు 1930 సంవత్సరంలో కెనడాలోని హామిల్టన్‌లో జరిగాయి. ఆ తర్వాత దీనిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా ప్రారంభించారు. ఈ మొదటి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పాల్గొనలేదు. 1934లో భారతదేశం తొలిసారిగా ఈ క్రీడల్లో పాల్గొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఈ క్రీడల మహా కుంభ్‌లో భారత్ పాల్గొంటోంది. కామన్వెల్త్ క్రీడలు 2022 జులై 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన భారతదేశానికి చెందిన 10 చారిత్రక విషయాలను ఇప్పుడు చూద్దాం..

  1. భారతదేశం తన మొట్టమొదటి పతకాన్ని 1934 కామన్వెల్త్ క్రీడలలో సాధించింది. ఈ పతకాన్ని రెజ్లింగ్‌లో రషీద్ అన్వర్ అందించాడు.
  2. కామన్వెల్త్‌లో తొలి స్వర్ణం కోసం భారత్ పూర్తి 24 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. 1958లో కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన మిల్కా సింగ్ స్వర్ణం అందించాడు.
  3. కామన్వెల్త్ గేమ్స్ 1978లో భారత మహిళలు తొలిసారిగా పతకాలు సాధించారు. ఈ ఏడాది కెనడాలోని ఎడ్మంటన్‌లో అమీ ఘియా, కన్వాల్ ఠాకూర్ కాంస్య పతకాలు సాధించారు.
  4. భారతదేశం నుంచి స్వర్ణం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి రూప ఉన్నికృష్ణన్. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది.
  5. ఇవి కూడా చదవండి
  6. డిస్క్ త్రోయర్ కృష్ణ పునియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణాన్ని అందించాడు. కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచిన 52 సంవత్సరాల తర్వాత 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ స్వర్ణం వచ్చింది.
  7. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు రెండు సార్లు రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. సిడ్నీ 1938, వాంకోవర్ 1954లో భారత జట్టుకు ఒక్క పతకం కూడా దక్కలేదు.
  8. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి అత్యధిక పతకాలు సాధించిన టాప్-5 దేశాల్లో భారత్ చేరింది.
  9. కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ ఆటగాడు షూటర్ జస్పాల్ రానా. అతను ఇప్పటివరకు 15 కామన్వెల్త్ గేమ్స్ పతకాలను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.
  10. న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం 101 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్ తొలిసారి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
  11. కామన్వెల్త్ క్రీడల 88 ఏళ్ల చరిత్రలో భారత్ మొత్తం 503 పతకాలు సాధించింది.