AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs WI: 35 బంతులు.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్.. భారత నయా ఆల్ రౌండర్ దొరికేశాడుగా

Axar Patel: అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ కారణంగా, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

IND Vs WI: 35 బంతులు.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్.. భారత నయా ఆల్ రౌండర్ దొరికేశాడుగా
Axar Patel
Venkata Chari
|

Updated on: Jul 25, 2022 | 12:30 PM

Share

Axar Patel: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 312 పరుగుల క్లిష్ట లక్ష్యాన్ని చేధించి విజయాన్ని నమోదు చేసుకుంది. 35 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ భారత విజయంలో హీరోగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ తన ఇన్నింగ్స్ తనకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. క్లిష్ట సమయంలో వచ్చిన ఈ ఇన్నింగ్స్‌తో జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐపీఎల్‌లోనూ ఇదే చేశాం’ అంటూ పేర్కొన్నాడు.

అక్షర్ పటేల్ తన విజయ రహస్యాన్ని కూడా బయటపెట్టాడు. మేం ప్రశాంతంగా ఉండి పరుగుల వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ ఆడుతున్నాను. భవిష్యత్తులో కూడా జట్టు కోసం ఇలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టాడు.

312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ మధ్య నాల్గవ వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్ తిరిగి పుంజుకునేందుకు ఈ ఇన్నింగ్స్ కీలకంగా మారింది. అక్షర్ పటేల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచి, సిరీస్‌లో భారత్‌కు తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లకు క్రెడిట్ అందించాడు. ఈ ఆటగాళ్లు విజయంపై ఆశలు వదులుకోలేదని, అందుకే భారీ లక్ష్యాన్ని సాధించగలిగామని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.