WI vs IND: మూడో వన్డేలో టీమిండియా ఘనవిజయం.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ధావన్ సేన.. 39 ఏళ్ల తర్వాత తొలిసారి..

మూడో వన్డేలో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 119 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

WI vs IND: మూడో వన్డేలో టీమిండియా ఘనవిజయం.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ధావన్ సేన.. 39 ఏళ్ల తర్వాత తొలిసారి..
Wi Vs Ind
Follow us

|

Updated on: Jul 28, 2022 | 6:43 AM

India vs West Indies: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 119 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 39 ఏళ్లుగా వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌ ఆడిన భారత జట్టు తొలిసారిగా కరీబియన్‌ జట్టును తమ స్వదేశంలో క్లీన్‌ చేయడంలో విజయం సాధించింది. మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ 58, శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులు చేశారు. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో భారత్ ఇన్నింగ్స్ అక్కడితో ముగిసింది. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం వెస్టిండీస్‌కు 35 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ, కరీబియన్ జట్టు 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ తలో 42 పరుగులు సాధించారు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, ప్రసీద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.

వెస్టిండీస్‌కు బ్యాడ్‌ స్టార్ట్‌..

వెస్టిండీస్‌కు చాలా చెత్త ఆరంభం లభించింది. మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో కైల్ మేయర్స్, షెమర్ బ్రూక్స్ వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత, షాయ్ హోప్ ఇన్నింగ్స్‌ను కొంతసేపు నిలబడ్డాడు. అయితే అతను 33 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని వికెట్‌ను యుజువేంద్ర చాహల్‌ పడగొట్టాడు. ఒకానొక దశలో బ్రాండన్ కింగ్ టీమ్ ఇండియాకు ముప్పుగా పరిణమించవచ్చని అనిపించింది. అతను 37 బంతుల్లో 42 పరుగులతో ఆడుతున్న క్రమంలో అక్షర్ పటేల్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెస్టిండీస్‌కు నాలుగో దెబ్బ తగిలింది. దీని తర్వాత భారత ధాటికి కరీబియన్‌ బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలవలేకపోయారు.

ఇవి కూడా చదవండి

ధావన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్..

కెప్టెన్ ధావన్ తన వన్డే కెరీర్‌లో 37వ అర్ధశతకం సాధించి అవుట్ అయ్యాడు. అతని బ్యాటింగ్‌లో 58 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 138 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ మొదటి నుంచి వెస్టిండీస్ బౌలర్లను ఆధిపత్యం చెలాయించారు. ఈ భాగస్వామ్యంలో ధావన్ 58, శుభ్‌మన్ 51 పరుగులు సాధించారు.

రెండు జట్ల ప్లేయింగ్-XI:

భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ధ్ కృష్ణ.

వెస్టిండీస్ : షాయ్ హోప్, బ్రాండన్ కింగ్, కీసీ కార్తీ, షెమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, కీమో పాల్, అకిల్ హోస్సేన్, హేడెన్ వాల్ష్, జాడెన్ సీల్స్.