AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: కుప్పకూలే స్థితి నుంచి.. శాసించే స్థాయికి భారత్.. పంత్, జడేజా దెబ్బకు ఆ రికార్డులన్నీ ఢమాల్..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ టెస్టు తొలి రోజున రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జోడీ 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టారు.

IND vs ENG: కుప్పకూలే స్థితి నుంచి.. శాసించే స్థాయికి భారత్.. పంత్, జడేజా దెబ్బకు ఆ రికార్డులన్నీ ఢమాల్..
India Vs England Ravindra Jadeja Pant
Venkata Chari
|

Updated on: Jul 02, 2022 | 12:02 PM

Share

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు రిషబ్ పంత్ (Rishabh Pant), రవీంద్ర జడేజా జోడీ అద్భుతాలు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఒకానొక స్థితిలో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పంత్, జడేజా తమ బ్యాటింగ్‌తో మ్యాజిక్‌ చేశారు. దీంతో జట్టును ఇబ్బందికర పరిస్థితికి చేరుకోకుండా కాపాడారు. వీరిద్దరు పరుగుల వర్షం కురిపించి తొలిరోజు టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో పంత్, జడేజా మధ్య 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 146 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, జడేజా 83 పరుగులతో తొలి రోజు ఆట ముగిసే వరకు క్రీజులో నిలిచాడు. తొలి రోజు భారత్ 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. పంత్‌, జడేజా జోడీ తొలిరోజు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

  1. విదేశాల్లో వీరిద్దరి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరో లేదా అంతకంటే తక్కువ వికెట్‌కు భారతం తరపున ఉమ్మడి అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.
  2. కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాపై మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ జోడీ 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జట్టు 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో అజారుద్దీన్, టెండూల్కర్ సంయమనం పాటించి, ఈ భాగస్వామ్యాన్ని కలిగి నెలకొల్పారు.
  3. పంత్ ఆసియా వెలుపల 5 టెస్ట్ సెంచరీలలో 4 సాధించాడు. అతని కంటే ముందు, 25 ఏళ్లు నిండకముందే ఆసియా వెలుపల అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లు కేవలం ఇద్దరు మాత్రమే. టెండూల్కర్ 7 సార్లు, సునీల్ గవాస్కర్ 5 సార్లతో టాప్ 2లో ఉన్నారు.
  4. ఇంగ్లండ్‌లో టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 1990లో లార్డ్స్‌లో 87 బంతుల్లో అద్భుతాలు చేసిన మహ్మద్ అజారుద్దీన్ ఇంగ్లండ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్.
  5. ఇవి కూడా చదవండి
  6. పంత్, జడేజాల 222 పరుగుల భాగస్వామ్యం టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరపున ఉమ్మడి నాల్గవ అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాపై 298 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన దిలీప్ వెంగ్‌సర్కార్‌, రవిశాస్త్రిల పేరిటే అత్యధిక భాగస్వామ్యం రికార్డు నిలిచింది.
  7. ఇంగ్లండ్‌ గడ్డపై ఆరో వికెట్‌కి ఇది రెండో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. గ్యారీ సోబర్స్, డేవిడ్ హోల్ఫోర్డ్ పేరిట ఉన్న రికార్డును స్వల్ప తేడాతో బద్దలు కొట్టే అవకాశాన్ని పంత్, జడేజా జోడీ కోల్పోయారు. సోబర్స్, హోల్ఫోర్డ్ 1996లో 274 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
  8. పంత్, జడేజాల భాగస్వామ్యం ఇంగ్లండ్‌లో ఏ భారతీయ జోడీలోనైనా నాల్గవ అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.