AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India T20 WC Squad Analysis: బలమైన జట్టుతో బరిలోకి భారత్.. 11 ఏళ్ల ట్రోఫీ కళ నెరవేర్చేనా?

T20 World Cup 2024 Squad: యూఎస్ఏ-వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుతో నలుగురిని రిజర్వ్ ప్లేయర్‌లుగా ఎంపిక చేశారు. అయితే ఈ 19 మంది ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కలేదు.

India T20 WC Squad Analysis: బలమైన జట్టుతో బరిలోకి భారత్.. 11 ఏళ్ల ట్రోఫీ కళ నెరవేర్చేనా?
Team India T20 Wc Sqaud
Venkata Chari
|

Updated on: Apr 30, 2024 | 4:51 PM

Share

T20 World Cup 2024 Analysis: జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ కోసం భారత T20 జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే, సంజూ శాంసన్, రిషబ్ పంత్ కూడా జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కనిపించారు. ఈ ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన శివమ్ దూబే ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.

మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లుగా శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్‌లు ఎంపికయ్యారు. అంటే 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఎవరైనా తప్పుకుంటే, ఈ నలుగురు ఆటగాళ్లలో ఒకరిని ఎంపిక చేస్తారు. అయితే, ఈ జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కలేదు.

అలాగే, ఈ ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలింగ్‌తో మెరిసిన మయాంక్ యాదవ్‌ను కూడా ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదు. బదులుగా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా పేసర్లుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, స్పిన్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఉన్నారు. అలాగే టీమ్ ఇండియాకు చెందిన హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లుగా కనిపించారు.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు భారత ప్రపంచకప్ జట్టులో టాప్-4 బ్యాట్స్‌మెన్‌లుగా ఎంపికయ్యారు. హిట్‌మన్‌తో విజయవంతమైన జైస్వాల్ ఓపెనర్‌గా, కింగ్ కోహ్లీ మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. అలాగే సూర్యకుమార్ కూడా నాలుగో స్థానంలో బరిలోకి దిగడం ఖాయం. హార్దిక్ పాండ్యా ఐదో నంబర్‌లో ఆడుతాడా లేక శివమ్ దూబేకి అవకాశం లభిస్తుందా అనేది చూడాలి.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

రిజర్వ్‌లు – శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..