AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng 5th Test: టెస్ట్ జట్టు నుంచి రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా.. రేపటి నుంచే కీలక పోరు..

IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకింది.

Ind vs Eng 5th Test: టెస్ట్ జట్టు నుంచి రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా.. రేపటి నుంచే కీలక పోరు..
Ind Vs Eng 5th Test
Venkata Chari
|

Updated on: Jun 30, 2022 | 6:45 PM

Share

శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. రోహిత్‌కు గురువారం యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా, అతనికి మళ్లీ కరోనా సోకినట్లు తేలింది. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే సిరీస్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. కరోనాతో ఐదవ, చివరి మ్యాచ్ వాయిదా పడింది. ఈ మ్యాచ్ ఇప్పుడు జులై 1 నుంచి జరగనుంది.

భారత టెస్టు జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ , ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్

గతంలో ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు దాదాపు న్యూజిలాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌లో దిగిన జట్టునే ఎంపిక చేసింది. ఆ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. జేమ్స్ ఆండర్సన్ తిరిగి వచ్చాడు.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: అలెక్స్ లీస్, జాక్ క్రౌలీ, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్

ఆధిక్యంలో భారత్..

నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీని తర్వాత లండన్‌లో జరిగిన తదుపరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. లీడ్స్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత భారత్ లండన్‌లో 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల తర్వాత, సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. దీని తర్వాత టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లను కరోనా దెబ్బతీసింది. దీంతో ఐదవ మ్యాచ్ ఆగిపోగా, ప్రస్తుతం రేపటి నుంచి నిర్వహించనున్నారు.