AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: జింబాబ్వేలోకి అడుగుపెట్టిన భారత యువసేన.. తొలిసారి స్పెషల్ సిరీస్.. అదేంటంటే?

IND vs ZIM: శుభ్‌మన్ గిల్ సారథ్యంలో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాలనే ఉద్దేశంతో టీమిండియా జింబాబ్వే చేరుకుంది. టీమిండియా జింబాబ్వే టూర్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో చివరి మ్యాచ్ జులై 14న జరగనుంది.

Video: జింబాబ్వేలోకి అడుగుపెట్టిన భారత యువసేన.. తొలిసారి స్పెషల్ సిరీస్.. అదేంటంటే?
Ind Vs Zim Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 03, 2024 | 12:09 PM

IND vs ZIM: జింబాబ్వే నుంచి 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు హరారే చేరుకున్నారు. ఈ పర్యటనలో భారత జట్టు జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. జింబాబ్వే టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. వీవీఎస్ లక్ష్మణ్ ఈ పర్యటనలో భారత ఆటగాళ్లతో పాటు కోచ్ పాత్రలో ఉన్నాడు. మరోవైపు, జింబాబ్వే జట్టు గురించి మాట్లాడితే, భారత జట్టు హరారే చేరుకోవడానికి ముందే తన ప్రాక్టీస్ ప్రారంభించింది.

శుభ్‌మాన్ గిల్ సారథ్యంలోని టీం ఇండియా హరారేకు చేరుకున్న ఫొటోలు, వీడియోలను జింబాబ్వే క్రికెట్ బోర్డు తన X హ్యాండిల్‌లో షేర్ చేసింది. టీమ్ ఇండియాలోని మిగతా ఆటగాళ్లు భారత్ నుంచి విమానంలో జింబాబ్వే చేరుకున్నారు. కాగా, టీ20 సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ అమెరికా నుంచి నేరుగా హరారే చేరుకున్నాడు.

అమెరికాలో సెలవుల అనంతరం జింబాబ్వే చేరిన గిల్..

2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా గిల్ భారత జట్టు రిజర్వ్ స్క్వాడ్‌లో భాగంగా ఉన్నాడు. కానీ, గ్రూప్ దశ తర్వాత జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. జట్టు నుంచి విడుదలైన తర్వాత, గిల్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక, ఇప్పుడు అక్కడి నుంచి విమానం ఎక్కి హరారేలో టీమ్‌లో జాయిన్ అయ్యాడు.

తొలిసారి 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్..

ఈ పర్యటనలో తొలిసారిగా భారత్-జింబాబ్వే మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జింబాబ్వేతో టీమ్ ఇండియా 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడలేదు. 2010లో జింబాబ్వే పర్యటనలో భారత్ 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడి 2-0తో గెలిచింది. ఆ తర్వాత, 2015లో కూడా జింబాబ్వే పర్యటనలో 2-మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడారు. ఇది 1-1తో డ్రా అయింది. 2016లో భారత జట్టు జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 2-1తో కైవసం చేసుకుంది.

భారత్‌కు పోటీగా జింబాబ్వే ప్రాక్టీస్ షురూ..

హరారే చేరుకున్న తర్వాత, టీమ్ ఇండియా ఇప్పుడు సన్నాహాలు ప్రారంభించనుంది. అయితే ఆతిథ్య జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించింది. మైదానంలో నిరంతరం చెమటలు పట్టిస్తూ కనిపించింది.

టీ20 ఫార్మాట్‌ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, శుభ్‌మన్ గిల్‌ను కాబోయే కెప్టెన్‌గా చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, గిల్ కెప్టెన్సీ కెరీర్‌కు జింబాబ్వే పర్యటన కీలకం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..