AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak: 150 పరుగులు చేసిన జట్టుదే విజయం.. తేల్చేసిన ఆ 4 మ్యాచ్‌లు..

T20 World Cup 2024: T20 వరల్డ్ కప్‌లో 19వ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్నందున భారీ స్కోరును ఆశించలేం.

Ind vs Pak: 150 పరుగులు చేసిన జట్టుదే విజయం.. తేల్చేసిన ఆ 4 మ్యాచ్‌లు..
Ind Vs Pak Match Stats
Venkata Chari
|

Updated on: Jun 09, 2024 | 11:48 AM

Share

T20 World Cup 2024: T20 వరల్డ్ కప్‌లో 19వ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్నందున భారీ స్కోరును ఆశించలేం. ఎందుకంటే, ఈ మైదానంలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక్క జట్టు కూడా 150కి మించి పరుగులు చేయలేదు.

అందుకే, ఈ మైదానంలో 150 పరుగులు సాధిస్తే విజయం ఖాయమని అంటున్నారు. ఈ మైదానంలో జరిగిన 4 మ్యాచ్‌ల గణాంకాలే ఇందుకు నిదర్శనం..

శ్రీలంక vs దక్షిణాఫ్రికా: శ్రీలంక, దక్షిణాఫ్రికా తమ మొదటి మ్యాచ్‌ను నసావు క్రికెట్ స్టేడియంలో ఆడాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.1 ఓవర్లలో కేవలం 77 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా జట్టు 16.2 ఓవర్లు పట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ వర్సెస్ ఐర్లాండ్: ఈ మైదానం టీ20 ప్రపంచకప్ 8వ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.

కెనడా వర్సెస్ ఐర్లాండ్: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్ జట్టు 125 పరుగులకే ఆలౌటైంది. దీంతో కెనడా జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా: టీ20 ప్రపంచకప్ 16వ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 103 పరుగులు చేసింది. ఈ సులువైన లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా జట్టు 18.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది.

అంటే నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో అత్యధిక స్కోరు 137 పరుగులు. కెనడా జట్టు సాధించిన ఈ గరిష్ట స్కోరును ఐర్లాండ్ జట్టు ఛేజ్ చేయలేకపోయింది. అందుకే నసావ్ స్టేడియంలో 150కి పైగా పరుగులు వస్తే ఛేజింగ్ కష్టమేనని చెప్పొచ్చు.

ముఖ్యంగా పాకిస్థాన్‌పై భారత జట్టు 150 పరుగులు చేస్తే భారత జట్టు విజయం ఖాయం. ఎందుకంటే పాకిస్థాన్ జట్టుకు సరైన బ్యాటింగ్ లైనప్ లేదు. కాబట్టి, టీమిండియా విజయానికి 150 పరుగులు సరిపోతాయి.

పాకిస్థాన్ జట్టు 150 పరుగులు చేస్తే?

పాకిస్థాన్ 150 పరుగులు చేస్తే ఎవరు గెలుస్తారనే ప్రశ్నలు రావడం సహజం. ఎందుకంటే ఇదే మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. కాబట్టి, పాకిస్థాన్ భారీ స్కోరును కలెక్ట్ చేసినా, బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ ఛేజింగ్‌ను ఆశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..