AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: కెప్టెన్‌గా శుభమాన్ గిల్ తొలి మ్యాచ్‌లోనే నిరాశ.. పెర్త్‌లో టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే

ఆస్ట్రేలియా పర్త్ వన్డేలో భారత జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 26 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ నియమం ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యం లభించింది. కంగారూ జట్టు 29 బంతులు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని సాధించింది.

IND vs AUS: కెప్టెన్‌గా శుభమాన్ గిల్ తొలి మ్యాచ్‌లోనే నిరాశ.. పెర్త్‌లో టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే
Ind Vs Aus
Rakesh
|

Updated on: Oct 19, 2025 | 6:55 PM

Share

IND vs AUS: ఆస్ట్రేలియా పర్త్ వన్డేలో భారత జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 26 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ నియమం ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యం లభించింది. కంగారూ జట్టు 29 బంతులు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పేలవమైన ప్రదర్శన, ఓటమికి గల 5 కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

భారత్ ఓటమికి 5 కారణాలు

పెర్త్ పిచ్‌ను అర్థం చేసుకోలేకపోయిన టీమిండియా

మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడానికి ముందు నుంచే పిచ్‌లో అసాధారణమైన బౌన్స్ కనిపించింది. రోహిత్ శర్మ చాలా సార్లు బంతిని మిస్ అయ్యాడు. దీనివల్ల చాలా మంది బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. రాహుల్ 38 పరుగులు, అక్షర్ పటేల్ 31 పరుగులు చేశారు. వారిద్దరు తప్ప ఇతర ఏ భారత బ్యాట్స్‌మెన్ 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. మరోవైపు ఆస్ట్రేలియా 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ, 6 పరుగులు రన్ రేట్‌తో స్కోర్‌బోర్డును ముందుకు నడిపింది. ఇక్కడ పరుగులు చేయవచ్చని ఆస్ట్రేలియా నిరూపించింది, కానీ భారత బ్యాట్స్‌మెన్‌లు పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు.

సరైన బ్యాటింగ్ ఆర్డర్ లేకపోవడం

భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ నంబర్-4 వరకు బ్యాట్స్‌మెన్‌లకు అలవాటైన విధంగానే ఉంది. కానీ నంబర్-5లో కేఎల్ రాహుల్ వన్డే సగటు 56 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, అక్షర్ పటేల్‌ను అతని కంటే ముందు పంపారు. అదేవిధంగా, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే, అతన్ని ఆరవ స్థానంలో పంపించి ఉంటే టీమిండియా పెద్ద స్కోర్ వైపు వెళ్ళేదేమో అని అనిపించింది. ఆరవ స్థానంలో వాషింగ్టన్ సుందర్‎ను పంపారు. ఈ నిర్ణయాలు బ్యాటింగ్ ఆర్డర్‌లో వ్యూహాత్మక లోపాలను చూపించాయి.

పేలవమైన షాట్ సెలక్షన్

ముందుగా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే.. అతను ఆఫ్-స్టంప్ వెలుపల వెళ్తున్న బంతిని అనవసరంగా ఆడటానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. కోహ్లీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు. కెప్టెన్ శుభమాన్ గిల్ లెగ్ సైడ్ వైపు వెళ్తున్న బంతిని నియంత్రించలేక వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా సాధారణంగా మంచి బ్యాటింగ్ చేస్తాడు, కానీ స్లోవర్ బంతిని అర్థం చేసుకోలేక తన వికెట్‌ను కోల్పోయాడు. ఇవి బ్యాట్స్‌మెన్‌ల చెత్త షాట్ సెలక్షన్‌కు ఉదాహరణలు.

టాప్ ఆర్డర్ దారుణంగా కుప్పకూలడం

మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడానికి ముందే భారత బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో చాలా కష్టపడ్డారు. టాప్ ఆర్డర్ దారుణంగా కుప్పకూలడం టీమిండియా ఓటమికి ఒక ప్రధాన కారణం. 25 పరుగులకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ముగ్గురూ ఔట్ అయ్యారు. 50 పరుగుల స్కోరు చేరకముందే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. దీని ప్రభావం దిగువ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లపై పడింది. వారు ఒత్తిడికి లోనయ్యారు.

కుల్దీప్ యాదవ్ ఎంపిక సరైనదేనా?

భారత జట్టు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచింది. ఈ ఇద్దరు బ్యాటింగ్ చేయగలరు కాబట్టి వారికి అవకాశం లభించి ఉండవచ్చు. అయితే, పెర్త్ పిచ్ ఎప్పటికప్పుడు రిస్ట్ స్పిన్నర్లకు ప్రభావవంతంగా నిరూపితమైంది. పటేల్, సుందర్ వేర్వేరు చేతులతో బౌలింగ్ చేసినా, వారి బంతి వేగం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. దీనివల్ల ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లకు వారిని చదవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ పిచ్‌పై కుల్దీప్ యాదవ్ ఫ్లైటెడ్, టాప్-స్పిన్ బెతులు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉండేది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..