IND vs AUS: ‘గూగ్లీ’కి బలైన భారత బ్యాటర్లు.. చెత్త రికార్డుల్లో కోహ్లీ, రోహిత్లతో మరో 4గురు.. మరోసారి షాకేనా?
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్లు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలంటే భారత్ ఎలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తోంది. ఈ సిరీస్ను గెలవాలంటే భారత బ్యాట్స్మెన్ ముందు ఉన్న అతిపెద్ద సవాలు స్పిన్ బౌలింగ్. ఆసియా పిచ్లపై భారత బ్యాట్స్మెన్లకు ఇదో పజిల్గా మిగిలిపోయింది.
విరాట్ కోహ్లీ చాలా కాలంగా పేలవమైన సగటు ఫామ్తో ఇబ్బంది పడ్డాడు. అతను స్పిన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు కూడా కనిపించింది. 2021 నుంచి కోహ్లి ఆసియా పిచ్లలో తొమ్మిది మ్యాచ్లలో 16 ఇన్నింగ్స్లు ఆడాడు. కోహ్లీ 11 సార్లు స్పిన్నర్ల వల్ల పెవిలియన్ చేరాడు. అతని సగటు 22గా నిలిచింది.
స్పిన్ బౌలర్లపై రవీంద్ర జడేజా అత్యుత్తమ సగటును కలిగి ఉన్నాడు. అతను గాయం కారణంగా గత సంవత్సరంలో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అందులో అతను 5 ఇన్నింగ్స్లలో ఒక్కసారి మాత్రమే స్పిన్నర్కు బలి అయ్యాడు. అతని సగటు 139గా నిలిచింది.
శ్రేయాస్ అయ్యర్ గత రెండేళ్లలో ఆసియా పిచ్పై ఏడు మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడు మ్యాచ్ల్లో 12 ఇన్నింగ్స్ల్లో ఆరుసార్లు స్పిన్నర్కు బలయ్యాడు. అతని సగటు 68.6గా నిలిచింది. గిల్ 7సార్లు ఔట్ కాగా అతని సగటు 38.6గా నిలిచింది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 2021 సంవత్సరం నుంచి ఆరు మ్యాచ్లు ఆడాడు. ఈ ఆరు మ్యాచ్లలో, అతను 38.3 సగటుతో పరుగులు చేశాడు. ఈ క్రమంలో 6సార్లు స్పిన్నర్లచే అవుట్ అయ్యాడు. పుజారా చాలా సార్లు స్పిన్ బౌలర్ల బారిన పడ్డాడు. గత రెండేళ్లలో స్పిన్నర్లు 11 సార్లు అవుట్ చేయగా, సగటు 30గా నిలిచింది.
భారత ఆల్ రౌండర్లు ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత సులువు కాదు. గత రెండేళ్లలో ఆసియా పిచ్లపై అశ్విన్ 11 సార్లు, అక్షర్ 8 సార్లు ఔట్ అయ్యారు. ఇద్దరి సగటు దాదాపు 25గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..