AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్, పాక్ మ్యాచ్‌కి భారీ భద్రత

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం జరగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ముంబయిలో ఉగ్రదాడి తర్వాత కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు ఢీకొంటున్నాయి. దీనికితోడు ఇటీవల పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. స్టేడియంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐసీసీ అనుమానిస్తోంది. ఈ మేరకు భద్రతాపరమైన సమీక్షని నిర్వహించి.. […]

భారత్, పాక్ మ్యాచ్‌కి భారీ భద్రత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 6:50 PM

Share

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం జరగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ముంబయిలో ఉగ్రదాడి తర్వాత కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు ఢీకొంటున్నాయి. దీనికితోడు ఇటీవల పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. స్టేడియంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఐసీసీ అనుమానిస్తోంది. ఈ మేరకు భద్రతాపరమైన సమీక్షని నిర్వహించి.. తగిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన పాకిస్థాన్ జట్టు.. ప్రపంచకప్‌లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా దాదాపు 27 ఏళ్లుగా వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్లకి ఘనమైన నివాళి అర్పించాలని ఆశిస్తోంది.