Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?

భారత్ తన తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న జరగనుంది. దీని తర్వాత చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది.

Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?
Icc Womens World Cup 2022 Team India Semi Final Chances
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 21, 2022 | 5:15 PM

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(Icc Women World Cup 2022) లో ఆస్ట్రేలియా జట్టు మొదటి సెమీ-ఫైనలిస్ట్‌గా తన టిక్కెట్‌ను కన్మ్‌ఫాం చేసుకుంది. అంటే ఇప్పుడు కేవలం మరో మూడు టీంలకు మాత్రమే సెమీ ఫైనల్ చేరే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ఏడు టీంలు పోటీపడుతున్నాయి. ఇందులో భారత జట్టు(Team India Women’s) కూడా ఉంది. ప్రశ్న ఏమిటంటే, అసలు భారత్‌కు సెమీ-ఫైనల్‌ చేరే అవకాశం ఉందా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే, ఇందుకు టీమిండియా ప్రదర్శనతోపాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం తరచుగా జరుగుతుంది. అయితే అంతకుముందు టీమిండియా మాత్రం తన చివరి రెండు మ్యాచులను గెలవాల్సి ఉంటుంది. భారత జట్టు సెమీఫైనల్ ఆడుతుందా.. లేక టోర్నీ నుంచి నిష్క్రమించేనా.. అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఒకవేళ భారత్ సెమీఫైనల్ ఆడాల్సి వస్తే ఓటమి అనేది మరచిపోవాలి. అంటే ఇప్పటి వరకు భారత్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయింది. ఇప్పుడు మరో మ్యాచులో ఓడితే మరిన్ని సమస్యలు సృష్టించవచ్చు. అంటే, ఇలాంటి పరిస్థితిలో విజయం ఒక్కటే భారత్ ముందున్న మార్గంగా నిలిచింది.

భారత్ ఓడిపోతే కష్టమే..

టోర్నీలో భారత్ తన ఆరో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న జరగనుంది. దీని తర్వాత చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. అంటే మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీకొనాల్సి ఉంది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 సెమీ-ఫైనల్ ఆడాలంటే, భారత జట్టు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా రెండింటినీ ఓడించాలి. అంటే వీరిద్దరిపై విజయం సాధించాల్సి ఉంటుంది. భారత్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.

బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా టీంలపై భారత్‌ రికార్డు..

బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో పోటీపడటం భారతదేశానికి ఈజీగా లేదా కష్టంగా ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్‌తో భారత్ ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడగా, 100 శాతం విజయం సాధించింది. అంటే మొత్తం 4 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. ఈ దృక్కోణంలో మార్చి 22న బంగ్లాదేశ్‌పై భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో 27 వన్డేలు ఆడగా, అందులో భారత్ 15 విజయాలు సాధించగా, దక్షిణాఫ్రికా 11 సార్లు గెలిచింది. అదే సమయంలో, ఇద్దరి మధ్య 1 మ్యాచ్ టైగా నిలిచింది. అయితే దక్షిణాఫ్రికా ఇటీవలి ఫామ్‌ను బట్టి భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉంటేనే భారత్‌ దక్షిణాఫ్రికాను ఓడించి సెమీఫైనల్‌కు టిక్కెట్టును దక్కించుకోగలదు.

Also Read: IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?

IPL 2022: క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు?

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..