Team India: ఫోర్లు, సిక్సర్లతోనే అత్యధిక పరుగులు.. బౌండరీలతో రికార్డుల ఊచకోత.. లిస్ట్‌లో మనోళ్లే ముగ్గురు

Team India: భారత క్రికెట్ జట్టు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మల అద్భుతమైన ఇన్నింగ్స్‌లను, వారు బౌండరీల ద్వారా ఎన్ని పరుగులు సాధించారో ఓసారి చూద్దాం.

Team India: ఫోర్లు, సిక్సర్లతోనే అత్యధిక పరుగులు.. బౌండరీలతో రికార్డుల ఊచకోత.. లిస్ట్‌లో మనోళ్లే ముగ్గురు
Team India Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Feb 03, 2025 | 9:30 PM

Team India: ఫోర్లు, సిక్సర్ల వర్షం టీ20 ఫార్మాట్‌లో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక బ్యాట్స్‌మన్ ఒక ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అంటే బౌండరీలతో భారీగా పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఫోర్లు, సిక్స్‌లు అంటే బౌండరీల సాయంతో బ్యాట్స్‌మెన్‌లు ఒకే ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు చేశాడమన్నమాట. ఇందులో భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ కూడా వెనుకడుగు వేయలేదు.

టీ20 క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫార్మాట్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇందులో మెన్ ఇన్ బ్లూ బ్యాట్స్‌మెన్స్ విపరీతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫోర్లు, సిక్సర్లతో అత్యధిక పరుగులు చేసిన రికార్డు జాబితాలో భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా తమ పేరును నమోదు చేసుకున్నారు. టీ20ఐ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్స్‌లతో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు భారతీయ బ్యాట్స్‌మెన్‌లను ఇప్పుడు తెలుసుకుందాం..

3. తిలక్ వర్మ- 96 పరుగులు vs సౌతాఫ్రికా (2024)..

గతేడాది దక్షిణాఫ్రికాపై టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ మరిచిపోలేరు. జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో తిలక్ ప్రమాదకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లో అజేయంగా 120 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 9 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా బౌండరీల సాయంతో మొత్తం 96 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

2. అభిషేక్ శర్మ- 106 పరుగులు vs ఇంగ్లాండ్ (2025)..

ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతాలు చేశాడు. ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ప్రతిభ అద్భుత ఇన్నింగ్స్ ఆడి కేవలం 54 బంతులు ఎదుర్కొని 135 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే 106 పరుగులు వచ్చాయి. తద్వారా టీ20 మ్యాచ్‌లో బౌండరీల సాయంతో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

1. రోహిత్ శర్మ- 108 పరుగులు vs శ్రీలంక (2017)..

భారత క్రికెట్ జట్టు మాజీ టీ20 కెప్టెన్, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లో అద్భుతమైన స్థితిని కలిగి ఉన్నాడు. భారత్ తరపున ఈ ఫార్మాట్‌లో ఫోర్లు, సిక్సర్లతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రోహిత్ 118 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందులో అతను 12 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా బౌండరీల సాయంతో రోహిత్ 108 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..