Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND: ఏకైక టెస్ట్‌ను వదలని కోవిడ్.. పాజిటివ్‌గా తేలిన మరో ప్లేయర్.. సందిగ్ధంలో మ్యాచ్?

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న పటౌడీ సిరీస్ ప్రస్తుతం 2-1తో టీమిండియాకు అనుకూలంగా ఉంది. బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన ఈ సిరీస్‌లోని చివరి టెస్టు గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడింది.

ENG vs IND: ఏకైక టెస్ట్‌ను వదలని కోవిడ్.. పాజిటివ్‌గా తేలిన మరో ప్లేయర్.. సందిగ్ధంలో మ్యాచ్?
Ind Vs Eng Test Ben Foakes
Follow us
Venkata Chari

|

Updated on: Jun 26, 2022 | 4:34 PM

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జులై 1 నుంచి జరగనున్న బర్మింగ్‌హామ్ టెస్టుకు కరోనా ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే భారత జట్టులో కరోనా కేసులు వెలుగు చూడడంతో.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ కోరల్లో చిక్కుకుంది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెన్ ఫోక్స్‌(Ben Foakes)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, కరోనా సోకడంతో ఫాక్స్ హెడింగ్లీ టెస్ట్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. అతని స్థానంలో శామ్ బిల్లింగ్స్‌ను ఇంగ్లండ్ జట్టులో చేర్చింది. అయినప్పటికీ అతనికి ఇంకా ఐసీసీ ఆమోదం ఇవ్వలేదు.

శనివారం ముందు, వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేసిన తర్వాత ఫాక్స్ వికెట్ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో జానీ బెయిర్‌స్టో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శనివారం సాయంత్రం ఫాక్స్‌కు కరోనా పరీక్ష నిర్వహించగా, ఫలితం పాజిటివ్‌గా తేలింది.

బెన్ ఫాక్స్ స్థానంలో బిల్లింగ్స్..

ఇవి కూడా చదవండి

టీ20 బ్లాస్ట్‌లో కెంట్ తరపున క్రికెట్ ఆడుతున్న బిల్లింగ్స్ నేరుగా ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడాలంటే ఇంకా 5 వికెట్లు తీయాల్సి ఉంది. హెడింగ్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బెన్ ఫాక్స్ ఖాతా తెరవలేదు. 3 బంతులు ఎదుర్కొన్నా ఖాతా కూడా తెరవలేకపోయాడు.

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఒక ప్రకటనలో, బెన్ ఫాక్స్ మినహా, మరే ఇతర ఆటగాడు కరోనా పాజిటివ్‌గా మారలేదని పేర్కొంది. కరోనా పాజిటివ్ పరీక్ష కారణంగా ఫాక్స్ భారత్‌తో బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఆడటంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, అంతకు ముందే అతను కోలుకోవాలని బోర్డు కోరుతోంది.

భారత జట్టులోనూ కరోనా కేసులు..

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న పటౌడీ సిరీస్ ప్రస్తుతం 2-1తో టీమిండియాకు అనుకూలంగా ఉంది. బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన ఈ సిరీస్‌లోని చివరి టెస్టు గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ, అంతకు ముందు, కరోనా భారత జట్టు శిబిరంలో కలకలం రేపింది. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాజిటివ్‌గా తేలాడు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రోహిత్‌కి కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత, ఇప్పుడు భారతీయ ఆటగాళ్లందరికీ కరోనా పరీక్ష చేయనున్నారు.