AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్‌ను తప్పించిన కారణం అదేనంట.. 30 నిమిషాల్లో ప్లేయింగ్ 11ని మార్చేసిన గంభీర్?

Rohit Sharm bowled during training ahead of IND vs AUS Sydney test: సిడ్నీ టెస్ట్‌కు ముందు భారత జట్టులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్లేయింగ్ 11 నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. రోహిత్‌ను పక్కన పెట్టడం వెనుక గల కారణం కూడా బయటకు వచ్చింది.

Rohit Sharma: రోహిత్‌ను తప్పించిన కారణం అదేనంట.. 30 నిమిషాల్లో ప్లేయింగ్ 11ని మార్చేసిన గంభీర్?
Rohti Sharma 5th Test
Venkata Chari
|

Updated on: Jan 03, 2025 | 12:57 PM

Share

Rohit Sharm Bowled During Training Ahead of IND vs AUS Sydney Test: సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో, చివరి టెస్టు జరగనుంది. అయితే జనవరి 3 శుక్రవారం నుంచి జరుగుతోన్న ఈ మ్యాచ్‌కు ముందే భారత శిబిరంలో భూకంపం వచ్చిందంట. మొదట, భారత డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య వివాదం వార్తలు వచ్చాయి. నివేదికల ప్రకారం, పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్న భారత కెప్టెన్ రోహిత్‌ను 5వ టెస్ట్ నుంచి తొలగించారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు, ఎలా తీసుకున్నారనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. తెరవెనుక జరిగిన కథంతా ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్ శర్మను ఎందుకు తప్పించారంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ ముందు వరకు అంతా సవ్యంగానే ఉంది. అతను సిడ్నీ టెస్టులో కూడా ఆడబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో శిక్షణ కోసం భారత జట్టుతో కలిసి మైదానానికి కూడా చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్న రోహిత్ 35 నిమిషాల పాటు బ్యాటింగ్ చేయలేదు. పీటీఐ నివేదిక ప్రకారం, ఆ తర్వాత అతను తన కిట్ లేకుండా నిశ్శబ్దంగా నెట్ ప్రాంతానికి వెళ్లాడు. ఈ సమయంలో, జట్టు ప్రధాన కోచ్ గంభీర్ నెట్‌కు దూరంగా నిలబడి జస్ప్రీత్ బుమ్రాతో మాట్లాడుతున్నాడు.

మరోవైపు, రోహిత్ వీడియో విశ్లేషకుడు హరి ప్రసాద్‌తో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ సమయంలో రోహిత్, గంభీర్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. భారత జట్టు టాప్ ఆర్డర్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇలా జరిగింది. ఆ తర్వాత రోహిత్ నెట్స్‌లోకి ప్రవేశించాడు. మెల్‌బోర్న్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల్సి వచ్చినప్పుడు అతను అదే చేశాడు. భారత కెప్టెన్ నెట్స్‌లో 30 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ త్రోడౌన్ లైన్‌పై బౌలింగ్ చేయడంతో.. అలాంటి ఓ బంతికి రోహిత్ బౌల్డ్ కావడం కనిపించింది. వాస్తవానికి, రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతికి ఆలస్యంగా స్పందించాడు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రోహిత్ పక్కనే ఉన్న నెట్‌లో రెడ్డి అద్భుత ఫామ్‌లో కనిపించాడు. రోహిత్ బ్యాటింగ్‌ను చూసి, శిక్షణ తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో సిడ్నీ టెస్టులో భారత కెప్టెన్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.

రోహిత్ జట్టుతో కలిసి రాలే..

శిక్షణ ముగిసిన తర్వాత, బుమ్రా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ శర్మ నెట్స్‌ను విడిచిపెట్టాడు. అయితే, గంభీర్ అక్కడే ఉన్నాడు. దాదాపు 45 నిమిషాల నుంచి గంట వరకు చాలా మంది ఆటగాళ్లు మెయిన్ గేట్ నుంచి టీమ్ బస్సు వైపు వెళ్లగా, రోహిత్ జట్టుతో కలిసి రాలేదు. మరో గేటు నుంచి స్టేడియం బయటకు వచ్చి బస్సు ఎక్కాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి