AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: భారత్‌లో ఆడితే ప్రాక్టీస్ అయినట్లేనా.. అక్కడెలా రాణిస్తారు.. బీసీసీఐ అసలు వ్యూహం ఏంటంటే?

Indian Cricket Team: ఆస్ట్రేలియాలో పరిస్థితులు భారత్‌ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండటమే పెద్ద ప్రశ్నగా మారింది. అక్కడి పిచ్‌ల నుంచి బౌలర్లకు ఎక్కువ బౌన్స్ వస్తుంది. భారతదేశంలో ఎంతో శ్రమిస్తే కానీ బంతి బౌన్స్ అవ్వదు.

T20 World Cup 2022: భారత్‌లో ఆడితే ప్రాక్టీస్ అయినట్లేనా.. అక్కడెలా రాణిస్తారు.. బీసీసీఐ అసలు వ్యూహం ఏంటంటే?
Team India
Venkata Chari
|

Updated on: Oct 05, 2022 | 10:53 AM

Share

T20 World Cup 2022 Special: మంగళవారం నుంచి మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. దీని తర్వాత భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు ప్రాక్టీస్‌ను పొందేలా బీసీసీఐ ఈ మ్యాచ్‌లన్నీ నిర్వహించినట్లు చెబుతున్నారు. కానీ, ఆస్ట్రేలియాలో పరిస్థితులు భారత్‌ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండటమే పెద్ద ప్రశ్నగా మారింది. అక్కడి పిచ్‌ల నుంచి బౌలర్లకు ఎక్కువ బౌన్స్ వస్తుంది. భారతదేశంలో ఎంతో శ్రమిస్తే కానీ బంతి బౌన్స్ అవ్వదు. అలాంటప్పుడు భారత్‌లోని పిచ్‌లపై ఆడడం ద్వారా ప్రపంచకప్ ప్రాక్టీస్ ఎలా పొందుతుంది? అంటూ మాజీలు ప్రశ్నలు లేవనెత్తున్నారు. అసలు బీసీసీఐ మదిలో ఏముంది.. ప్రాక్టీస్ కోసమే ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమ్ కాంబినేషన్‌పై ఎక్కువ ఫోకస్..

ఈ సమయంలో పరిస్థితి కంటే టీమ్ కాంబినేషన్‌పైనే భారత జట్టు దృష్టి ఎక్కువగా ఉంది. ఆసియా కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, టీమ్ ఉత్తమ కాంబినేషన్‌ ఏమిటో గుర్తించలేకపోవడం. ఎవరు ఓపెనింగ్ చేయాలి, మిడిల్ ఆర్డర్‌లో ఏ నంబర్‌లో ఎవరిని పంపాలో గుర్తించకపోవడమే అని తెలుస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ల ద్వారా తన అత్యుత్తమ జట్టు కలయికను తెలుసుకోవాలనుకుంటోంది. ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్న భారత్.. ఈ రెండు సిరీస్‌లకు దాదాపు ఒకే జట్టును ఎంపిక చేసింది.

ఇవి కూడా చదవండి

పిచ్‌ల తయారీలో ఐసీసీదే నిర్ణయం..

టీ20 క్రికెట్‌లో చాలా దేశాలు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ని తయారు చేస్తాయి. భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతూ వరల్డ్ కప్ ప్రాక్టీస్ చేయడం వెనుక రెండో కారణం కూడా ఉంది. టీ20 క్రికెట్ ఎక్కడ ఉన్నా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం అనేది వాస్తవం. ఆస్ట్రేలియాలో ఎక్కువ బౌన్స్ ఉంటుంది. కానీ, ఆసియా బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడలేని పరిస్థితి ఉండదు. ఏది ఏమైనా ప్రపంచకప్ సమయంలో పిచ్ ఎలా ఉండాలనేది ఆతిథ్య దేశం నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీ మాత్రమే పిచ్‌లపై నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల భారత్‌తో సహా ఆసియాలోని అన్ని దేశాల బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడే చోట ఆస్ట్రేలియా వారు కోరుకున్నప్పటికీ అలాంటి పిచ్‌లను తయారు చేయలేరు.

బౌన్సర్లకు భయపడని భారత్ బ్యాటర్స్..

భారత బ్యాట్స్‌మెన్‌లు ఇక బౌన్స్‌కు భయపడరు. ప్రపంచకప్ ప్రాక్టీస్ కోసం బౌన్సీ పరిస్థితుల తర్వాత పరిగెత్తకపోవడానికి మూడవ కారణం గత కొన్నేళ్లుగా భారత బ్యాట్స్‌మెన్ బౌన్స్‌ను బాగా ఎదుర్కోవడం నేర్చుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్‌ గెలిచిన ఏకైక జట్టుగా భారత జట్టు నిలిచింది. ఇది కాకుండా గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో భారత్ ప్రదర్శన వన్డే, టీ20 క్రికెట్‌లో కూడా మెరుగ్గా ఉంది.

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల మధ్య తేడాలు..

భారత్‌లో ఇప్పటి వరకు 111 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. సగటున, ఓవర్‌కు 8.15 చొప్పున పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 54 T20 ఇంటర్నేషనల్‌లు జరిగాయి. ఇక్కడ ఓవర్‌కు 7.91 చొప్పున పరుగులు వచ్చాయి.

భారత్‌లో జరిగే మ్యాచ్‌లలో మంచు పాత్ర చాలా ముఖ్యమైనది. రాత్రిపూట మంచు కురుస్తున్న కారణంగా, బంతి తడిగా, పట్టుకోవడం కష్టం అవుతుంది. ఆస్ట్రేలియాలో మంచు సమస్య అంతగా లేదు. అందుకే మొత్తం 40 ఓవర్లు ఇదే పరిస్థితి ఉంటుంది.

ఆస్ట్రేలియాలో 54 టీ20 ఇంటర్నేషనల్స్‌లో బ్యాట్స్‌మెన్ 63 సార్లు యాభై ప్లస్ స్కోర్లు సాధించారు. వీటిలో మూడు సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంటే అక్కడ ఒక మ్యాచ్‌లో సగటున 1.16 మంది బ్యాట్స్‌మెన్ యాభై ప్లస్ స్కోర్లు చేశారు.

భారత్‌లో 111 మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ 150 సార్లు యాభై ప్లస్ స్కోర్లు సాధించారు. వీటిలో 8 సెంచరీలు, 142 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంటే, భారతదేశంలో ఒక మ్యాచ్‌లో సగటున 1.35 బ్యాట్స్‌మెన్ యాభై ప్లస్ స్కోర్లు చేశారు.

భారత్‌లో ఆడిన 111 మ్యాచ్‌ల్లో 1178 వికెట్లు (రనౌట్‌లు మినహా) సాధించింది. అంటే ప్రతీ మ్యాచ్‌లో బౌలర్లు 10.6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో 54 మ్యాచుల్లో బౌలర్లు 601 వికెట్లు పడగొట్టారు. అంటే ప్రతి మ్యాచ్‌లో బౌలర్లు దాదాపు 11.13 వికెట్లు పడగొట్టారు.

భారత పరిస్థితులు బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా ఉన్నాయని పై డేటాను బట్టి స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాలో బౌలర్లకు మరింత సహాయం ఉంటుదని తేలింది. అయితే, తేడా మాత్రం తక్కువగానే ఉంది. అందువల్ల ప్రపంచకప్‌నకు ముందు భారత్‌లో లేదా ఆస్ట్రేలియాలో మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారా అనేది భారత మేనేజ్‌మెంట్‌కు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం టీమ్ కూర్పుపైనే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.

Follow Us