T20 Cricket: ఐదుగురు బ్యాటర్స్ జీరో.. 35 పరుగులకే ఆలౌట్.. జట్టు స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే ఎక్కువ..

క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా 35 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు.. ఇంతవరకు విజయాన్ని సాధించలేదు. ప్రస్తుత మ్యాచ్‌లోనూ మరోసారి ఇదే నిరూపితమైంది.

T20 Cricket: ఐదుగురు బ్యాటర్స్ జీరో.. 35 పరుగులకే ఆలౌట్.. జట్టు స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే ఎక్కువ..
Cricket
Follow us

|

Updated on: Jun 17, 2022 | 2:43 PM

గత ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటైంది. అయితే అది టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌. కానీ, ప్రస్తుతం మాట్లాడుతున్న టీ20 మ్యాచ్‌లో ఓ జట్టు కేవలం 35 పరుగులకే ఆలౌట్ అయింది. క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా 35 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు విజయాన్ని ఎవరూ ఊహించలేరు. 35 పరుగుల వద్ద కుప్పకూలిన తర్వాత, ఈ జట్టు కూడా గెలవలేదు. మొత్తంగా 75 బంతులు, 9 వికెట్ల భారీ తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. బోట్స్వానా వర్సెస్ ఉగాండా (Botswana Women vs Uganda Women) మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మ్యాచ్‌లో ఉగాండాపై బోట్స్వానా జట్టు కేవలం 35 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో బోట్స్వానా తొలుత బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 18.5 ఓవర్లలో జట్టు మొత్తం 35 పరుగులకే పరిమితమైంది. అనంతరం 36 పరుగుల లక్ష్యాన్ని ఉగాండా జట్టు 8 ఓవర్లు పూర్తి కాకముందే ఛేదించింది.

ఇవి కూడా చదవండి

బోట్స్వానా 35 పరుగులకే ఆలౌట్..

స్కోరు బోర్డుకు 5 పరుగులు మాత్రమే జోడించి ఓపెనర్లు డగౌట్‌కు చేరుకున్నారు. జట్టు కెప్టెన్ ఖాతా కూడా తెరవలేదు. ఈ జట్టుకు గరిష్టంగా 13 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అదే సమయంలో, 8వ నంబర్ బ్యాట్స్‌మెన్ 7 పరుగులు చేసింది.

బోట్స్వానా ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. ఉగాండా నుంచి సమర్థవంతమైన బౌలింగ్ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. జానెట్ మబ్బాజీ కేవలం 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కిల్లర్ బౌలింగ్‌లో కాన్సీ అవెకో 5 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు.

7.3 ఓవర్లలో ఉగాండా విజయం..

లక్ష్యాన్ని ఉగాండా కేవలం 1 వికెట్ కోల్పోయి 7.3 ఓవర్లలో 36 పరుగులు చేసి సాధించింది. జానెట్ మబ్బాజీ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆ జట్టు ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ కెవిన్ అవినో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జానెట్ మబ్బాజీ తన ఆల్ రౌండ్ గేమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.