AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం.. హోటల్ గదుల్లోనే భారత ఆటగాళ్లు.. జైషా కీలక నిర్ణయం..

Barbados Weather Update: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది. బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్‌పోర్టు ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్‌ నుంచి బయట పడేసేందుకు ప్లాన్ వేసింది.

Team India: బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం.. హోటల్ గదుల్లోనే భారత ఆటగాళ్లు.. జైషా కీలక నిర్ణయం..
Team India In Barbodos
Venkata Chari
|

Updated on: Jul 02, 2024 | 7:26 AM

Share

Barbados Weather Update: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది. బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్‌పోర్టు ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్‌ నుంచి బయటపడేసేందుకు ప్లాన్ వేసింది. ఛార్టర్డ్ ఫ్లైట్ ద్వారా టీమ్ ఇండియాను భారత్‌కు రప్పించేందుకు జై షా ప్లాన్ చేసినట్లు సమాచారం.

తుఫాన్ నుంచి టీమిండియాను బీసీసీఐ ఎలా కాపాడుతుంది?

బీసీసీఐ సెక్రటరీ జై షా మీడియాతో మాట్లాడుతూ.. ఆటగాళ్లను, భారత మీడియా ప్రతినిధులను సురక్షితంగా తరలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం బార్బడోస్ నుంచి చార్టర్డ్ విమానంలో బయలుదేరేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని, అయితే విమానాశ్రయం మూసివేయడం వల్ల ఈ అవకాశం కోల్పోయిందని జే షా తెలియజేశారు. చార్టర్డ్ విమానాలను నడుపుతున్న కంపెనీలతో బోర్డు టచ్‌లో ఉందని, బార్బడోస్ విమానాశ్రయం తెరిచిన వెంటనే, బృందం అమెరికా లేదా యూరప్‌కు వెళ్తుందని జై షా తెలియజేశారు.

మంగళవారం కూడా బార్బడోస్ వదిలి వెళ్లడం కష్టం..!

మంగళవారం కూడా బార్బడోస్‌ను వదిలి వెళ్లడం టీమిండియాకు కష్టంగా ఉంది. ఎందుకంటే, అక్కడ తుఫాన్ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. ఎయిర్‌పోర్టు అధికారులతో బీసీసీఐ టచ్‌లో ఉందని జే షా మీడియాకు తెలిపారు. విమానాశ్రయం పనిచేయడం ప్రారంభించిన వెంటనే, టీమిండియా చార్టర్డ్ విమానంలో అమెరికా లేదా యూరప్‌కు వెళ్తుంది. దీని తర్వాత అక్కడి నుంచి టీమిండియా భారత్‌కు రానుంది. అయితే, గాలి వేగం తగ్గినప్పుడే ఇదంతా సాధ్యమవుతుందని జై షా అన్నారు. ప్రకృతితో పోరాడాలని ఎవరూ కోరుకోరని, అందుకే వేచి ఉండటమే మంచిదని జై షా అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్