AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: నిజమైన హీరోలకు గుర్తింపు.. గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్లకు భారీగా నజరానా ప్రకటించిన జైషా

శ్రీలంకలోని గ్రౌండ్ స్టాఫ్ సమస్యలతో పోరాడుతూ వర్షం సమస్యను ఎదుర్కొంటూ మైదానాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ వచ్చారు. ఆసియా కప్‌ సక్సెస్‌ కావడంలో నిజమైన హీరోలు వీళ్లేనంటూ టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ తన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ప్రైజ్‌మనీ మొత్తాన్ని శ్రీలంక గ్రౌండ్‌ స్టాఫ్‌కు నజరానాగా అందించారు. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్‌కు 50,000 అమెరికన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 42 లక్షలు) రివార్డును అందించారు.

Asia Cup 2023: నిజమైన హీరోలకు గుర్తింపు.. గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్లకు భారీగా నజరానా ప్రకటించిన జైషా
Acc President Jay Shah
Basha Shek
|

Updated on: Sep 17, 2023 | 10:19 PM

Share

ఆసియా కప్-2023 ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి భారత క్రికెట్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఈ ఆసియా కప్‌ను మొదటి నుంచి సమస్యలు, వివాదాలు చుట్టుముట్టాయి. మొదట టోర్నీ ఆతిథ్యానికి సంబంధించి చాలా రోజుల పాటు వివాదాలు కొనసాగాయి. ఆపై శ్రీలంకలో వర్షాల కుండపోత కారణంగా సమస్యలు తగ్గలేద కానీ మరింత జఠిలంగా మారాయి. కానీ శ్రీలంకలోని గ్రౌండ్ స్టాఫ్ సమస్యలతో పోరాడుతూ వర్షం సమస్యను ఎదుర్కొంటూ మైదానాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ వచ్చారు. ఆసియా కప్‌ సక్సెస్‌ కావడంలో నిజమైన హీరోలు వీళ్లేనంటూ టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ తన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ప్రైజ్‌మనీ మొత్తాన్ని శ్రీలంక గ్రౌండ్‌ స్టాఫ్‌కు నజరానాగా అందించారు. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్‌కు 50,000 అమెరికన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 42 లక్షలు) రివార్డును అందించారు. ఈ ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ, ఈ టోర్నీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ స్పష్టంగా చెప్పింది. దీని తరువాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారతదేశం మ్యాచ్‌లను శ్రీలంకలో, మిగిలిన మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహించాలని సూచించింది, అయితే పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని, మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో ఆడాలని ఏసీసీ నిర్ణయించింది.

ఈ సమయంలో శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగానే సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ వర్షం ఇబ్బంది కలిగించింది. అటువంటి పరిస్థితిలో, గ్రౌండ్ స్టాఫ్ నిరంతరం శ్రమిస్తూ మైదానాన్ని సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈక్రమంలోనే కొలంబో, క్యాండీ గ్రౌండ్‌స్టాఫ్‌లను గౌరవించాలని ACC, శ్రీలంక క్రికెట్ బోర్డు సంయుక్తంగా నిర్ణయించుకున్నాయని జైషా ట్వీట్ చేశారు. ఈ రెండు చోట్ల గ్రౌండ్ స్టాఫ్‌కి 50,000 అమెరికన్ డాలర్లు అంటే సుమారు 40 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు జై షా తెలిపారు. ఈ సందర్భంగా గ్రౌండ్ స్టాఫ్‌ను జై షా ప్రత్యేకంగా అభినందించారు. ఫైనల్‌లో కూడా వర్షం ముప్పు ఉన్నందున రిజర్వ్ డేని కూడా ఉంచారు. అయితే అది పెద్దగా అవసరం లేకుండా పోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురవడంతో టాస్ ఆలస్యమైనా మైదానం సిబ్బంది మ్యాచ్‌పై ప్రభావం చూపలేదు. మ్యాచ్‌లో ఓవర్ల సంఖ్య కూడా తగ్గలేదు. అయితే మ్యాచ్ ఎక్కువ సేపు సాగలేదు. శ్రీలంకను 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఆ తర్వాత 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని ఎనిమిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా సెలబ్రేషన్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us