AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs GT : రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. రియాన్ పరాగ్ దూరం.. కెప్టెన్‌గా యువ సంచలనం యశస్వి జైస్వాల్

RR vs GT : రియాన్ పరాగ్ అందుబాటులో లేకపోవడంతో యాజమాన్యం యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నమ్మకం ఉంచింది. టాస్ గెలిచిన అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల ఉత్సాహం వ్యక్తం చేశాడు. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది.

RR vs GT : రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. రియాన్ పరాగ్ దూరం.. కెప్టెన్‌గా యువ సంచలనం యశస్వి జైస్వాల్
Riyan Parag
Venkata Chari
|

Updated on: May 09, 2026 | 8:22 PM

Share

RR vs GT : ఐపీఎల్ 2026లో కీలక దశలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన పోరుకు ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ దూరమయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలను యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ చేతుల్లో పెట్టడం క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతున్న ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఆడటం లేదు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన సమయంలో పరాగ్ కండరాల నొప్పితో (హామ్‌స్ట్రింగ్ గాయం) ఇబ్బంది పడ్డాడు. ఈ గాయం తీవ్రత తగ్గకపోవడంతో వైద్య బృందం సూచన మేరకు అతనికి విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుత సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉండి, జట్టును ముందుండి నడిపిస్తున్న పరాగ్ లేకపోవడం రాజస్థాన్‌కు పెద్ద లోటు అనే చెప్పాలి.

సారథిగా యశస్వి సరికొత్త ప్రయాణం

పరాగ్ అందుబాటులో లేకపోవడంతో యాజమాన్యం యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నమ్మకం ఉంచింది. టాస్ గెలిచిన అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల ఉత్సాహం వ్యక్తం చేశాడు. “మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. ఈ వికెట్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. రియాన్ త్వరలోనే కోలుకుని జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాను. అతని స్థానంలో సిమ్రాన్ హెట్మెయర్, యశ్ రాజ్ పుంజా తుది జట్టులోకి వచ్చారు” అని జైస్వాల్ పేర్కొన్నాడు.

ప్లేఆఫ్స్ వేటలో కీలక మ్యాచ్

పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా సమానమైన పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది. పరాగ్ లేని లోటును పూడ్చాల్సిన బాధ్యత ఇప్పుడు రవీంద్ర జడేజా, హెట్మెయర్ వంటి సీనియర్లపై ఉంది. జైస్వాల్ తన దూకుడు బ్యాటింగ్‌తో పాటు నాయకత్వంలోనూ ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు

యశస్వి జైస్వాల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సిమ్రాన్ హెట్మెయర్, డొనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.

Follow Us