AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్లకే టెస్ట్‌ క్రికెట్‌లో అరంగేట్రం.. ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి టెస్ట్‌లోనే సెంచరీ బాదిన ఇండియన్ బ్యాట్స్‌మెన్..

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అక్కడ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో

20 ఏళ్లకే టెస్ట్‌ క్రికెట్‌లో అరంగేట్రం.. ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి టెస్ట్‌లోనే సెంచరీ బాదిన ఇండియన్ బ్యాట్స్‌మెన్..
Cricket Batting
uppula Raju
|

Updated on: Jul 28, 2021 | 11:14 AM

Share

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అక్కడ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఒక యువ భారత బ్యాట్స్ మాన్ చారిత్రాత్మక ప్రదర్శన గురించి తెలుసుకోవాల్సి ఉంది. ఆ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇదే రోజున ఇంగ్లాండ్‌తో ఈ మ్యాచ్ జరిగింది. 20 ఏళ్ళ వయసులో భారత క్రికెట్ జట్టులో టెస్ట్ అరంగేట్రం చేస్తూ సెంచరీ సాధించాడు.

1959 లో భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్లో జూలై 23 నుంచి 28 వరకు టెస్ట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 490 పరుగులు చేసింది. ఇందులో జియోఫ్ పుల్లర్ 131, మైక్ స్మిత్ 100 పరుగులు చేశారు. ఆయనతో పాటు కెన్ బారింగ్టన్ 87 పరుగులు చేయగా, కెప్టెన్ కోలిన్ కౌడ్రీ 67 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున సురేంద్ర నాథ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. దీనికి సమాధానంగా భారత జట్టు 208 పరుగులకు ఆలౌట్ అయింది. చందు బోర్డే మాత్రం 75 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అబ్బాస్ అలీ బేగ్ మూడో స్థానంలో 26 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు.

తరువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈసారి ఎనిమిది వికెట్ల నష్టానికి ఆతిథ్య జట్టు 265 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గిల్బర్ట్ పార్క్‌హౌస్ 49 పరుగులు చేయగా, రే ఇల్లింగ్‌వర్త్ నాటౌట్ 47 పరుగులు చేశాడు. కెన్ బారింగ్టన్ ఈసారి 46 పరుగులు అందించగా, టెడ్ డెక్స్టర్ కూడా 45 పరుగులు చేయడంలో విజయం సాధించాడు. సుభాష్ గుప్తే నాలుగు వికెట్లు వచ్చాయి. భారత జట్టు గెలవడానికి 548 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన అబ్బాస్ అలీ బేగ్ రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేశాడు. 260 నిమిషాల ఇన్నింగ్స్ తర్వాత అతను రనౌట్ అయ్యాడు. వీరితో పాటు పాలీ ఉమ్రిగార్ 118 పరుగులు చేయగా, నారి కాంట్రాక్టర్ 56 పరుగులు చేశాడు. టీమిండియా 376 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను 171 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే అబ్బాస్ అలీ బేగ్ 20 సంవత్సరాల 131 రోజుల వయసులో అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడయ్యాడు.

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి అవసరం లేదు.. మనదేశంలోనే వాటిని తయారు చేయగలం!

Tokyo Olympics 2021:ఒలంపిక్స్‌లో మరో విజయాన్ని సొంతం చేసుకున్న పీవీ సింధు.. గ్రూప్ జే నుంచి ప్రీ క్వార్ట్రర్స్‌లోకి ఎంట్రీ

Covid Patient Suicide : తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య.. పోలీసుల విచారణ..