Lifestyle: పీరియడ్స్ సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?

భారతదేశం ఆధునికత వైపు దూసుకుపోతోంది. బహిష్టు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమయంలో కూడా చాలా చోట్ల పీరియడ్స్ వచ్చిన స్త్రీని అపవిత్రంగా చూస్తారు. ఆమెకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఆలయం, పూజలు చేయడం నిషేధం.

Lifestyle: పీరియడ్స్ సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?
Period
Follow us

|

Updated on: Jan 07, 2023 | 9:05 AM

నియమాలు లేకుండా మనిషి సమాజంలో జీవించలేడు. స్థిరమైన సమాజానికి కొన్ని నియమాలు అవసరం. ప్రతి మతం, కులం కూడా దాని స్వంత ఆచారాలు, నియమాలు, చట్రంలో జీవిస్తాయి. ఈ నియమం విషయానికి వస్తే ఋతుస్రావం కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది. స్త్రీలలో రుతుక్రమం అనేది సహజమైన ప్రక్రియ. పురాతన కాలం నుండి ఈ రుతుస్రావం గురించి అనేక నమ్మకాలు,ఆచారాలు ఉన్నాయి. హిందూమతంలో, రుతుక్రమం సమయంలో స్త్రీలు దేవాలయాలకు వెళ్లకూడదని లేదా పూజాది కార్యక్రమాలలో పాల్గొనకూడదని ఆచారం. భారతదేశం ఆధునికత వైపు దూసుకుపోతోంది. బహిష్టు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమయంలో కూడా చాలా చోట్ల పీరియడ్స్ వచ్చిన స్త్రీని అపవిత్రంగా చూస్తారు. ఆమెకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఆలయం, పూజలు, నదిలో స్నానం చేయడం నిషేధం. రజస్వల అయిన స్త్రీ గుడికి ఎందుకు వెళ్ళకూడదు, పూజ ఎందుకు చేయకూడదు అనే శాస్త్రీయ కారణాలు ఇక్కడ తెలుసుకుందాం..

రుతుక్రమం ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం ఎందుకు నిషేధం: బహిష్టు సమయంలో దేవాలయాలకు, ప్రార్థనా స్థలాలకు వెళ్లడాన్ని హిందూ ధర్మం నిషేధించింది. ఇది పరమ సత్యం. వంట గదిలోకి వెళ్లకూడదని, నదిలో స్నానం చేయకూడదని కూడా అంటారు. దీనికి మతపరమైన కారణాలు ఏవైనా.. దీనికి శాస్త్రీయ కారణం హార్మోన్ల మార్పులే. ఋతుస్రావం సమయంలో స్త్రీ శరీరంలో చాలా హార్మోన్లు మారుతాయి. దీని వల్ల ఆమెకు చిరాకు, కోపం వస్తుంది. ఆమె మనసు ప్రతికూలతతో నిండిపోయి ఉంటుంది. నదిలో స్నానం చేసే సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. సాధారణ రోజు కంటే మనస్సు కొద్దిగా భిన్నంగా ఉండటం వల్ల వంటగదిలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకుముందు పదుల మందికి వండి పెట్టాల్సి వచ్చేది. పీరియడ్స్ సమయంలో నిల్చుని వంట చేయడం కష్టంగా ఉండేది. అందుకే విశ్రాంతి తీసుకోవడానికి వంటింటికి రావద్దని చెప్పేవారు. దేవాలయం అనేది సానుకూలతతో నిండిన ప్రదేశం. గుడికి వెళ్లేటప్పుడు మనసు పాజిటివిటీతో నిండిపోవాలి. కానీ గుడికి వెళ్లినప్పుడు చిరాకుగా అనిపిస్తే శాంతి కలుగదు. ఆలయానికి వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆలయంలోకి ప్రవేశం నిషేధించారు.

ఇది మాత్రమే కాదు, పూర్వ కాలంలో ఏదైనా దేవుడిని పూజించేటప్పుడు కీర్తన ముఖ్యం. మంత్రం పఠించకుండా పూజ పూర్తయ్యేదికాదు. మంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. ఉచ్ఛారణలో తప్పులు చేయవద్దు. కానీ ఋతుస్రావం సమయంలో ఒక మహిళ నొప్పి, అలసటతో ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని మంత్రం జపించడం కుదరదు. అందుకే పూజలు చేయడం నిషేధించబడింది.

ఇవి కూడా చదవండి

గుడికి వెళ్లడం పవిత్రంగా ఉండాలని నమ్ముతాం. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలని సూచించారు. అయితే గతంలో మహిళలకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. బహిష్టు సమయంలో స్నానం కూడా చేసేవారుకాదు.. కాబట్టి గుడికి రావద్దని సూచించారు. పూజ చేసేటప్పుడు లేదా గుడికి వెళుతున్నప్పుడు మీకు పీరియడ్స్ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి మీరు శిక్షించబడరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..