AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమ‌ల‌లో జీడిప‌ప్పును బ‌ద్ద‌లుగా మార్చే సేవ‌ ప్రారంభం..ఈ సేవ ప్రాముఖ్యత ఏంటంటే..

తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టిటిడి గురువారం నుంచి జీడిప‌ప్పును బ‌ద్ద‌లుగా మార్చే సేవను ప్రారంభించింది. శ్రీవారి సేవా సదన్ -2లో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ఈ సేవను ప్రారంభించారు. ఈ సందర్భంగా

TTD: తిరుమ‌ల‌లో జీడిప‌ప్పును బ‌ద్ద‌లుగా మార్చే సేవ‌ ప్రారంభం..ఈ సేవ ప్రాముఖ్యత ఏంటంటే..
Cashew Nuts
Jyothi Gadda
|

Updated on: May 26, 2022 | 6:33 PM

Share

తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టిటిడి గురువారం నుంచి జీడిప‌ప్పును బ‌ద్ద‌లుగా మార్చే సేవను ప్రారంభించింది. శ్రీవారి సేవా సదన్ -2లో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ఈ సేవను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి ప్ర‌సాదాలు, అన్న‌ప్ర‌సాదాల త‌యారీ కోసం టిటిడి సాధారణంగా టెండర్ల ద్వారా జీడిపప్పును కొనుగోలు చేస్తుందన్నారు. జీడిపప్పు బ‌ద్ద‌లు త‌గినంత మొత్తంలో ల‌భించ‌క‌పోవ‌డంతో మార్చి 21న తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శ్రీ‌వారి సేవ‌కుల‌తో జీడిపప్పు బ‌ద్ద‌ల‌ సేవను ప్రారంభించామ‌ని తెలిపారు. గత 52 రోజుల్లో శ్రీ‌వారి సేవ‌కులు 26 వేల‌ కిలోల జీడిపప్పును బ‌ద్ద‌లుగా మార్చార‌ని చెప్పారు. రోజుకు 100 మంది చొప్పున ఇప్ప‌టివ‌ర‌కు తిరుప‌తిలో 5200 మంది సేవకులు ఈ సేవ‌లో పాల్గొన్నార‌ని తెలిపారు.

ఇకపోతే, తిరుమలలో ప్రతి రోజు ప్రసాదాల తయారీకి 3500 కిలోల నుండి 4000 కిలోల వరకు జీడిపప్పు బ‌ద్ద‌లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్పారు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి. దీంతో తిరుమ‌ల‌లో కూడా శ్రీ‌వారి సేవ‌కుల‌తో జీడిప‌ప్పు బ‌ద్ద‌ల సేవను ప్రారంభించామ‌న్నారు. విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ప‌లు సంస్థ‌లు జీడిప‌ప్పును బ‌ద్ద‌లుగా మార్చే యంత్రాలను త‌యారు చేస్తున్నాయ‌ని, ట్ర‌య‌ల్ ర‌న్ కూడా జ‌రిగింద‌ని తెలిపారు. ఈ యంత్రాలు బాగా ప‌నిచేస్తే కొనుగోలు చేస్తామ‌న్నారు. అప్పటి వరకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.

అనంత‌రం ప‌లువురు శ్రీ‌వారి సేవ‌కుల‌తో ఈవో మాట్లాడుతూ జీడిప‌ప్పును బ‌ద్ద‌లుగా మార్చే సేవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో మార్కెటింగ్ జిఎం శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్ బాబు, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, విజివో శ్రీ బాలిరెడ్డి, డెప్యూటీ ఇఇ శ్రీ దామోద‌రం, శ్రీ‌వారి సేవ ఏఈవో శ్రీ‌మ‌తి నిర్మ‌ల ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి
Follow Us
ఎయిర్‌పోర్టులో మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్
ఎయిర్‌పోర్టులో మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్
దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత.. కంపెనీల కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత.. కంపెనీల కీలక నిర్ణయం
పుచ్చకాయ మంచిదే.. కానీ, ఈ 3 వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..
పుచ్చకాయ మంచిదే.. కానీ, ఈ 3 వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్
RO వాటర్‌ తాగుతున్నారా? వణుకుపుట్టించే మ్యాటర్‌!
RO వాటర్‌ తాగుతున్నారా? వణుకుపుట్టించే మ్యాటర్‌!
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!